amp pages | Sakshi

అన్నప్రాసన పార్టీ అడిగి.. క్యారీ బ్యాగ్‌తో ముఖానికి ముసుగు వేసి..

Published on Tue, 11/22/2022 - 10:49

సాక్షి, హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: పల్నాడు జిల్లా నాదెండ్లకు చెందిన ఓ వ్యక్తిని హతమార్చి కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరులోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చోరీ ముఠాలో సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్లితే.. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామానికి చెందిన జంగం చంటి (28), గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రాయపాటి వెంకన్న, తుమ్మా సుబ్రహ్మణ్యం, షేక్‌ సుభాని అలియాస్‌ సిద్ధు, ముత్యాల నవీన్, పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన షేక్‌ నాగుల్‌ మీరా అలియాస్‌ బిల్లాతో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారు. ఈ నేపథ్యంలో గతేడాది కేరళలో దొంగతనం చేసిన ఈ ముఠా సభ్యులు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు అపహరించారు. దీనిలో కొంత బంగారం విక్రయించేందుకు జంగం చంటికి ఇవ్వగా, విక్రయించిన మొత్తాన్ని తిరిగి ముఠా సభ్యులకు చెల్లించకపోవటంతో వీరి మధ్య వివాదం ఏర్పడింది. దీంతో చంటిని హతమార్చేందుకు పథకం రచించిన రాయపాటి వెంకన్న, ఇతర ముఠా సభ్యులు గత ఏడాది నవంబర్‌ 16వ తేదీన నమ్మకంగా అతనిని ఇంటి నుంచి తీసుకువెళ్లారు.

అదే రోజు చంటి కుమారుడి అన్నప్రాసన కావటంతో పార్టీ ఇవ్వమని కోరటంతో మిత్రులతో కలిసి వెళ్లాడు. ఆ తర్వాత విజయవాడలోని ఓ హోటల్‌లో రూం తీసుకుని చంటిని ఇతర ముఠా సభ్యులు చితకబాదారు. అనంతరం కారులో ఎక్కించుకుని క్యారీ బ్యాగ్‌తో ముఖానికి ముసుగు వేసి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని పూడ్చివేసేందుకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ జాతీయ రహాదారి పక్కన బొమ్ములూరులో శ్మశాన వాటిక కనిపించటంతో అక్కడ రాత్రి వేళలో పూడ్చిపెట్టి పరారయ్యారు. జంగం చంటి కనిపించటం లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వ్యక్తి అదృశ్యం కేసు నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు.

చదవండి: (పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. భార్యపై అనుమానంతో...)

పోలీసుల విచారణలో భాగంగా చంటిని ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లిన  తోటి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించటంతో క్రమంగా వాస్తవాలు బయటకు వచ్చాయి. జంగం చంటిని హత్యచేసి బాపులపాడు మండలం బొమ్ములూరులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శ్మశానవాటికలో పూడ్చిపెట్టినట్లు పోలీసులకు చెప్పటంతో నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్, చిలకలూరిపేట సీఐ వై.అచ్చయ్య సోమవారం సంఘటనాస్థలికి చేరుకున్నారు.

బాపులపాడు తహసీల్దార్‌ టి.మల్లికార్జునరావు, హనుమాన్‌జంక్షన్‌ ఎస్‌ఐ టి.సూర్య శ్రీనివాస్‌ సమక్షంలో  సమాధిని తవ్వి జంగం చంటి మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. మృతుని సోదరుడు జంగం బాజీ, ఇతర కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగి, కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు నచ్చజెప్పటంతో ఆందోళన విరమించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)