విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
ప్రేమపెళ్లి: అత్తింటి వేధింపులు, భర్త సైతం..
Published on Mon, 04/05/2021 - 13:55
జయపురం: చెట్టుకి ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన బొయిపరిగుడ సమితిలోని గదొరగుడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం హల్దికుండ్ గ్రామపంచాయతీ, గొదరగుడ గ్రామానికి చెందిన దేవ బిశాయితో తులసి మఝి(22) పెళ్లి జరిగింది. వీరిది ప్రేమ వివాహం. కాగా, దంపతుల కులాలు వేర్వేరు కావడంతో బిశాయి కుటుంబ సభ్యులు తరచూ ఆ యువతిని వేధించేవారు.
అయితే, భర్త కూడా వారి వ్యాఖ్యలను ఖండించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తులసి ఆత్మహత్యకి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై మృతురాలి తండ్రి లక్ష్మణ మఝి ఆవేదన వ్యక్తం చేస్తూ తమ కూతురిని ఆమె అత్తింటి వారే చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటపపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి మృతదేహం తరలించారు.
చదవండి: కాళ్లపారాణి ఆరకముందే..
యువకుల వివాదం.. గర్భవతి అని చూడకుండా..
Tags