amp pages | Sakshi

కొల్లు రవీంద్రకు నోటీసులు

Published on Sat, 12/05/2020 - 03:48

సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై జరిగిన హత్యాయత్నం కేసులో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి  కొల్లు రవీంద్రకు మచిలీపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 91 కింద విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ కొల్లు నివాసానికి వెళ్లి ఇనగుదురుపేట సీఐ శ్రీనివాస్‌ నోటీసులు అందజేశారు. అయితే తన ఆరోగ్యం బాగాలేదని కుదుటపడగానే విచారణకు హాజరవుతానని మాజీ మంత్రి బదులిచ్చారు. కాగా, ఘటన జరిగిన వెంటనే కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు ఆయనపై అనుమానం కలిగేలా చేశాయి. ఇసుక కొరత వల్ల పనుల్లేకే నిందితుడు బడుగు నాగేశ్వరరావు మంత్రి నానిపై దాడి చేశాడని రవీంద్ర వ్యాఖ్యానించారు. నిందితుడు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలైన బడుగు ఉమాదేవికి స్వయానా సోదరుడైనప్పటికీ అతనికి తమ పార్టీతో ఎలాంటి సంబంధాల్లేవని ప్రకటించారు.

మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్యకేసులో మాదిరిగానే ఈ కేసులో కూడా తనను కావాలనే ఇరికించేస్తారని అన్నారు. ప్రాథమిక విచారణ కూడా పూర్తికాకుండానే మాజీ మంత్రి నుంచి ఈ తరహా స్టేట్‌మెంట్‌ రావడంతో ఈ కేసులో నిజంగానే ఆయన ప్రమేయం ఉందనే అనుమానాలు తలెత్తాయి. దీంతో ఈ వాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు గతంలో నోటీసులు జారీ చేయగా.. టీడీపీతో నిందితుడు బడుగు నాగేశ్వరరావుకు సంబంధం లేదని, ఇసుక కొరత వల్లే నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టుగా ఎస్పీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా తానలా మాట్లాడానని లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కొల్లు పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని విచారణాధికారైన బందరు డీఎస్పీ రమేష్‌రెడ్డి తాజాగా సీఆర్‌పీసీ కింద శుక్రవారం నోటీసులు జారీ చేశారు. విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని రవీంద్రను పోలీసులు హెచ్చరించారు. పలువురు టీడీపీ సీనియర్లతో చర్చించిన మీదట.. విచారణకు హాజరవుతానని రవీంద్ర తెలిపారు. 

సబ్‌జైలుకు నిందితుడి తరలింపు
మరోపక్క రెండ్రోజుల పోలీస్‌ కస్టడీ ముగియడంతో నిందితుడు బడుగు నాగేశ్వరరావును శుక్రవారం సాయంత్రం వైద్య పరీక్షలనంతరం మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. మంత్రిని హతమార్చేందుకే తాను వెళ్లానని, ఇందుకు తనను ఎవరూ పురిగొల్పలేదని విచారణలో నిందితుడు  బదులిచ్చినట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. కాగా టీడీపీ నేతలు మారగాని పరబ్రహ్మం, శ్రీను, నిందితుడి సోదరి ఉమాదేవి తదితరులను విచారించిన పోలీసులు కొంత మేర సమాచారాన్ని రాబట్టినట్టు తెలియవచ్చింది. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)