amp pages | Sakshi

వెండి సింహాల చోరుడి అరెస్ట్

Published on Sun, 01/24/2021 - 05:24

సాక్షి, అమరావతి బ్యూరో: బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రథానికి ఉండే మూడు వెండి సింహాల ప్రతిమలను అపహరించిన నిందితుడు జక్కంపూడి సాయిబాబా అలియాస్‌ జక్కంశెట్టి సాయిబాబాను అరెస్ట్‌ చేసినట్టు విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) బత్తిన శ్రీనివాసులు తెలిపారు. ప్రధాన నిందితుడితోపాటు వెండి ప్రతిమలను కొనుగోలు చేసిన వ్యాపారిని  అరెస్ట్‌ చేసి వారి నుంచి వెండి సింహాలకు సంబంధించి 9 కిలోల వెండి దిమ్మెలతోపాటు ఇతర ఆలయాల్లో చోరీ చేసిన మరో 6.4 కిలోల వెండి దిమ్మెలను స్వాదీనం చేసుకున్నామని చెప్పారు. సీపీ శనివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. 

జూలైలోనే చోరీ.. 
జక్కంపూడి సాయిబాబా 2008 నుంచి ఆలయాల్లో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. పగటి వేళ తాపీ, వ్యవసాయ పనులు చేస్తూ.. రాత్రివేళ ఎవరికీ అనుమానం రాకుండా దొంగతనాలు చేసేవాడు. లాక్‌డౌన్‌ సమయంలో పనుల్లేకపోవడంతో సాయిబాబా 2020 జూన్‌లో విజయవాడ వచ్చాడు. కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు దిగుతుండగా 7 అంతస్తుల భవనం కొండ పక్కన రేకుల షెడ్డులో నీలం రంగు పరదాతో కప్పి ఒక పక్కకు జారి ఉన్న వెండి రథం కనిపించింది. అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గమనించి రథానికి నాలుగు వైపులా వెండి సింహాల ప్రతిమలను చోరీ చేయాలని నిర్ణయించుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. తర్వాత భీమవరంలో పాత ఇనుప సామగ్రి దుకాణం నుంచి రెండు ఇనుప రాడ్లను కొనుగోలు చేసి వాటితో ఆటోలో గుడివాడ చేరుకున్నాడు. అక్కడి నుంచి విజయవాడ బస్టాండ్‌కు.. అక్కడి నుంచి దుర్గగుడి వద్దకు చేరుకున్నాడు.

చిత్తు కాగితాలు ఏరుకునే వాడిలా తనతో తెచ్చుకున్న సంచితో కొండ ప్రాంతంలో తిరుగుతూ.. రాత్రి 8.30 గంటలకు రథం ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. వెంట తెచ్చుకున్న రాడ్లతో మూడు సింహాలను పెకలించాడు. నాలుగో సింహాన్ని తొలగించే ప్రయత్నం చేయగా అది రథం నుంచి వేరు కాలేదు. మూడు సింహాల ప్రతిమలను తీసుకుని తణుకు నగర శివారులో గల కాలువ గట్టు చేరుకున్నాడు. వాటిని పగులగొట్టి తణుకులోని సురేంద్ర జ్యువెలరీ యజమాని ముత్త కమలే‹Ùకు రూ.35 వేలకు విక్రయించాడు. కేసును ఛేదించిన విజయవాడ వెస్ట్‌ జోన్‌ ఏసీపీ కె.హనుమంతరావు, సీఐ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఐ శ్రీనివాసరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావులకు రివార్డులు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో సిట్‌ డీఐజీ అశోక్‌కుమార్, డీసీపీ–2 విక్రాంత్‌పాటిల్‌ పాల్గొన్నారు. 

ఇలా పట్టుబడ్డాడు.. 
ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీస్‌ శాఖ మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ చోరీ ఆలయంలో పనిచేసే సిబ్బంది చేశారా, ఆలయ అభివృద్ధి పనులు చేయడానికి వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు చేశారా లేక పాత నేరస్తుల పనా అనే కోణాల్లో దర్యాప్తు జరిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆలయాల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్తుల కాల్‌ డేటాను కూడా పరిశీలించగా.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన సాయిబాబా ఈ నేరాన్ని చేసినట్టు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ నేరాన్ని తానే చేసినట్టు అంగీకరించిన సాయిబాబా.. దొంగలించిన వెండి ప్రతిమలను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ముత్త కమలేష్‌ అనే బంగారం వ్యాపారికి విక్రయించినట్టు చెప్పాడు.  

Videos

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌