amp pages | Sakshi

రైతులపై టీడీపీ నేతల దాష్టీకం

Published on Sat, 06/26/2021 - 04:05

వెంకటాచలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో తెలుగుదేశం నాయకులు శుక్రవారం దళిత రైతులపై దాడిచేశారు. అడ్డుకోబోయిన దళిత సర్పంచిపైనా దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ అనుమతులతో సర్వేపల్లి రిజర్వాయర్‌ నుంచి సారవంతమైన మట్టిని తమ పొలాలకు తోలుకుంటున్న దళిత రైతులపై టీడీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు దాడిచేశారు. రిజర్వాయర్‌లో అక్రమ మైనింగ్‌ ఎక్కడ జరిగిందో చూపాలన్న రైతులను కులం పేరుతో దూషించారు. టీడీపీ నాయకులు శుక్రవారం రిజర్వాయర్‌ వద్దకు వెళ్లి అక్రమ మైనింగ్‌ జరిగిందంటూ హంగామా చేశారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకున్నారు.

తమ పొలాలకు సారవంతమైన మట్టిని రిజర్వాయర్‌ నుంచి తోలుకునేందుకు ప్రభుత్వం అనుమతులిస్తే అడ్డుకోవడమేగాక, తప్పుడు ప్రచారాలు చేయడం ఏమిటని రైతులు వారిని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం, అధికారం కోల్పోయాక బ్లాక్‌ మెయిల్‌ చేయడం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. నాలుగుసార్లు ఓడిపోవడంతో సోమిరెడ్డి రైతులపై కక్షగట్టారన్నారు. దీంతో టీడీపీ నాయకులు ఒక్కసారిగా రైతులపై దాడికి దిగారు. ఈ దాడిలో దళిత రైతు మేకల నరసయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అడ్డుకోబోయిన దళిత సర్పంచ్‌ శీనమ్మపైనా దౌర్జన్యం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరికొందరు జోక్యం చేసుకుని సర్దుబాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది.  

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి  
మా పొలాలను బాగు చేసుకునేందుకు ప్రభుత్వ అనుమతులతో మట్టి తరలిస్తే అడ్డుకోవడమే కాకుండా ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారా? అని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతు నరసయ్యపై దాడి చేసి గాయపరచడమేగాక దళిత సర్పంచ్‌ శీనమ్మ, ఇతర రైతులపై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గాయపడిన నరసయ్యకు ప్రాథమిక చికిత్స చేయించి అక్కడే బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సోమిరెడ్డి ప్రోత్సాహంతోనే టీడీపీ  నేతలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించి, పథకం ప్రకారం దాడిచేశారని ఆరోపించారు. ఈ ఘటన గురించి తెలిసి రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునేలోపే టీడీపీ నాయకులు అక్కడ నుంచి పరారయ్యారు.

టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు  
టీడీపీ నేతల దాష్టీకంపై దళిత రైతు మేకల నరసయ్య, దళిత సర్పంచ్‌ శీనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు నలగట్ల సుబ్రహ్మణ్యం, మందల పవన్‌కుమార్, గుమ్మడి రాజాయాదవ్‌ తమపై దాడిచేయడమే కాకుండా కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌