amp pages | Sakshi

పథకం ప్రకారమే ఎన్‌కౌంటర్‌ 

Published on Wed, 11/17/2021 - 01:28

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణ తుది అంకానికి చేరింది. 53 మంది పోలీసులు, సాక్షుల విచారణ సోమవారంతో ముగియగా, మంగళవారం నుంచి మ రికొందరు పోలీసులు, నలుగురు నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు మొదలయ్యాయి. నలుగురు మృతులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్,  చెన్నకేశవులు కుటుంబసభ్యుల తరపున న్యాయవాదు లు ఇండిపెండెంట్‌ కౌన్సిల్‌ పీవీ కృష్ణమాచారి, సహాయకురాలు రజిని  కమిషన్‌కు వాదనలు వినిపించారు.  

నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు..
ఆయుధాలతో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉం డగా నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నాలేవీ చేయలేదని న్యాయవాదులు అన్నారు. పోలీసులే పథకం ప్రకారం ఎన్‌కౌంటర్‌ చేశారని కమిషన్‌కు తెలిపారు. నిందితులకు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వ కుండా కస్టడీలోకి తీసుకొని సీన్‌–రీకన్‌స్ట్రక్షన్‌ పేరిట పని పూర్తి చేశారని పేర్కొన్నారు. నలుగురిలో ముగ్గురు నిందితులు శివ, నవీన్, చెన్నకేశవులు మైనర్లని.. వారిని పోలీసులు జువెనైల్‌ కోర్టుకు పంపించకుండా తప్పుచేశారని కృష్ణమాచారి వివరించారు.

పైగా నిందితులు మరణించింది 2019, డిసెంబర్‌ 5 ఉదయం 5 గంటలలోపేనని డెత్‌ రిపోర్ట్‌ సూచిస్తుంటే.. పోలీసులు మాత్రం ఉదయం 6:15 గంటల తర్వాత జరిగిందని అబద్ధాలు చెబుతున్నారని ఆరో పించారు. పైగా విచారణలో పాల్గొన్న పోలీసుల స్టేట్‌మెంట్లు సరిగా నమోదు చేయలేదని వివరించారు. దిశ కేసులో ముందు నుంచి అన్నీ తానై నడిపించిన అప్పటి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌.. కమిషన్‌ విచారణలో మాత్రం తనకి, ఈ కేసుకు సంబంధం లేదని వాంగ్మూలం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అడ్వొకేట్‌ రజిని కమిషన్‌కు తెలిపారు. అనంతరం జర్నలిస్ట్‌ కె.సజయ తరపు న్యాయవాది వసుధ నాగరాజు వాదనలు వినిపించారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)