వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జాగ్రత్తగా నడపమన్నందుకు... కారుతో ఢీకొట్టారు
Published on Wed, 12/07/2022 - 10:14
మైసూరు: కారును ఇష్టానుసారంగా నడుపుతుండటంతో జాగ్రత్తగా నడపాలని చెప్పిన ముగ్గురు యువకులను అదే వాహనంతో ఢీకొట్టిన ఘటన మైసూరు నగరంలోని టీకే లేఔట్లో చోటుచేసుకుంది. కారు ఢీకొనడంతో ప్రజ్వల్, రాహుల్, ఆనంద్ అనేవారు ఆస్పత్రి పాలయ్యారు.
వివరాలు... మంగళవారం ఉదయం వాసు, అతని తండ్రి దర్శన్ ఫార్చునర్ కారులో రోడ్డుపై అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడంతో అక్కడే ఉన్న ప్రజ్వల్, రాహుల్, ఆనంద్ వారిని మందలించారు. దీంతో ఆగ్రహానికి గురైన వాసు, అతని తండ్రి కారుతో వెనక్కి వచ్చి ప్రజ్వల్, రాహుల్, ఆనంద్లను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ప్రజ్వల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సరస్వతీ పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: ఏడు నెలల క్రితమే పెళ్లి.. వివాహేతర సంబంధం కారణంగా..)
#
Tags