రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాళ్లపారాణి ఆరకముందే..
Published on Sun, 04/04/2021 - 22:05
బనశంకరి : కారు ప్రమాదంలో నవ వివాహిత దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నెలమంగల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిక్కమడ్నూరు గ్రామం దారందకుక్కు నివాసి గోపిక్ భార్య ధనూష (23) మృతురాలు. గోపిక్– ధనూషకు ఫిబ్రవరి 21న పెళ్లయింది. బంధువులతో కలిసి బెంగళూరులో బంధువుల ఇంటికి మారుతి వ్యాగనార్ కారులో బయలుదేరారు. శనివారం వేకువజామున బెంగళూరు సమీపంలోని నెలమంగల వద్ద వీరి కారును కోళ్ల లారీ ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జుకాగా ధనూష తీవ్రగాయాలతో చనిపోయింది. భర్త గోపిక్ , బంధువులు శుభలక్ష్మీ, రూపా వేణుగోపాల్కు తీవ్రగాయాలు తగిలాయి. నెలమంగల పోలీసులు చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. కొత్త జంటకు ప్రమాదంలో విషాదం నెలకొంది.
#
Tags