సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ
Breaking News
గోదావరిలో స్నానానికి వెళ్లిన యువకుడి మృతి
Published on Fri, 05/26/2023 - 02:12
నిడదవోలు రూరల్ / ఆత్రేయపురం : మండలంలోని తాడిమళ్ల గ్రామానికి చెందిన బి.వీరస్వామి (22) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ధాన్యం డబ్బు తీసేందుకు బ్యాంకుకు నిడదవోలు వెళ్లిన వీరస్వామి స్నేహితులతో కలిసి గురువారం మధ్యాహ్నం గోదావరిలో స్నానానికి వెళ్లి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు నాగమణి,వెంకటేశ్వరరావు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరస్వామి కూలీపనులతో పాటు చేపల వేటకు వెళ్తాడు. మృతుడికి సోదరి ఉండగా ఆమెకు వివాహమైంది.
పేకాట స్థావరంపై దాడి
అమలాపురం టౌన్: అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న బృందంపై పట్టణ పోలీసులు బుధవారం రాత్రి మెరుపు దాడి చేశారు. వారి నుంచి రూ.1.13 లక్షల నగ దు స్వాధీనం చేసుకున్నట్లు దాడి నిర్వహించిన పట్టణ ఎస్సై ప్రభాకర్ తెలిపారు. మొత్తం 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నగదుతోపాటు పేకాటకు ఉపయోగించే కాయన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Tags