amp pages | Sakshi

బౌలింగ్‌లో స్థిరత్వం.. అతనికి కోట్లు వచ్చేలా చేసింది

Published on Tue, 04/13/2021 - 17:52

చెన్నై: న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కైల్‌ జేమిసన్‌ను ఆర్‌సీబీ రూ. 15 కోట్లు పెట్టి కొన్న సంగతి తెలిసిందే.అతని కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా.. వేలంలో అంత ధర పలకడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ముంబైతో జరిగిన మ్యాచ్‌లో జేమిసన్‌ 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌ హీరో హర్షల్‌ పటేల్‌ జేమిసన్‌ ప్రదర్శనపై స్పందించాడు. బౌలింగ్‌లో స్థిరత్వం ఉండడం అతనికి కలిసొచ్చిన అంశం అని అభిప్రాయపడ్డాడు.  

''అతను బౌలింగ్‌ వేసే సమయంలో చూపించే పట్టుదల నాకు బాగా నచ్చింది. ఒక బౌలర్‌గా 6 అడుగుల 8 అంగుళాలు ఉండడం అతనికి కలిసొచ్చింది. కొత్త బంతితో స్థిరంగా బౌన్సర్లు రాబట్టగల నైపుణ్యం అతనిలో ఉంది. అలాగే డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ముద్ర వేయించుకున్న అతను మరోసారి దానిని ముంబైతో మ్యాచ్‌లో నిరూపించాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో అతను వేసిన యార్కర్‌ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. జేమిసన్‌ పవర్‌ ధాటికి కృనాల్‌ బ్యాట్‌ రెండు ముక్కలైంది. అతని బౌలింగ్‌లో ఉన్న స్థిరత్వమే ఆర్‌సీబీకి వేలంలో కోట్ల రూపాయలకు దక్కించుకునేలా చేసింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్‌ పటేల్‌ 5 వికెట్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై ఈ ఫీట్‌ చేసిన ఏకైక బౌలర్‌గా హర్షల్‌ నిలవడం విశేషం. కాగా ముంబైతో జరిగిన ఆ మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ డివిలియర్స్‌ మెరుపులతో ఆఖరిబంతికి విజయాన్ని సాధించింది. కాగా ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 14న చెన్నై వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడనుంది.
చదవండి: ‘వారివల్లే ఆర్సీబీకి..వేలానికి ముందు రోజు జరిగింది అదే’

Videos

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

Photos

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)