amp pages | Sakshi

పేకమేడలా కూలిపోయిన కంచుకోట!

Published on Fri, 11/19/2021 - 16:26

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్ఠా త్మకంగా జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని ప్రథమంగా చెప్పవచ్చు. కుప్పం ఎన్నికల తీర్పు కోసం 17వ తారీఖున దేశం మొత్తంగా ఎదురుచూసింది. కారణం ఇది చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దాదాపు 32 ఏళ్లుగా కుప్పం చంద్రబాబు అడ్డాగా, ఆయన కంచుకోటగా చెబుతూ వచ్చారు. 1983లో చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమి చవిచూశారు. తరువాత ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి తన జన్మస్థలమైన చంద్రగిరి నియోజకవర్గాన్ని కాదని చిత్తూరు జిల్లా ఆఖరులో, కర్ణాటక – తమిళనాడు సరిహద్దులో ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి 1989లో మొదటిసారి గెలుపు సాధించాడు.

ఈయన విజయ యాత్రకు వైఎస్సార్‌ సీపీ 2019 నుండి బ్రేకులు వేసింది. జగన్‌ పార్టీ వచ్చాక సంక్షేమ ఫలాలు ఇంటింటికీ అందడంతో ప్రజల్లో ఎనలేని చైతన్యం వచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులకు తప్ప చంద్రబాబు వల్ల తమకు ఎలాంటి మేలు జరగలేదని గ్రహించారు. ఏడెనిమిది సార్లు వరుస విజయాలతో చంద్రబాబుకు కుప్పం ప్రజలను బాగు చేయాలన్న బుద్ధి మాత్రం పెరగలేదు.  ఇన్నేళ్లుగా చంద్రబాబు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకపోవడంతో ఇప్పటికీ 50 వేలమంది పేదలు పొరుగు రాష్ట్రానికి వలస వెళుతుంటారు. ఈరోజు కుప్పం ప్రజల హృదయంలో చంద్రబాబు పటం పూర్తిగా చెరిగిపోయింది. దీంతోనే చంద్రబాబు చక్రం రివర్స్‌ ఆరంభం అయింది.

మొన్న జరిగిన మండల ఎన్నికల్లో, సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు పార్టీకి పెద్ద గండే కొట్టారు. జగన్‌ పార్టీ 70 శాతం పైగా సీట్లను గెలుచుకొని చంద్రబాబుకు కనువిప్పు కలిగించింది. ఈనెల 14న జరిగిన కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, లేకుంటే కుప్పంపై తాను పట్టు కోల్పోతానని బాబు బృహత్తర పథకం రూపొం దించారు. అక్టోబర్‌ 29, 30 తారీఖులలో కుప్పంలో పర్యటించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. సెంటిమెంట్లు కూడా తీసుకొచ్చారు. చివరికి ఒక వీధి రౌడీలా మీసం తిప్పే మాటలు కూడా చెప్పారు. కుప్పం ప్రజలే నాకు దేవుళ్ళు అన్నారు. తన అడ్డాలో మరొకరికి చోటే లేదన్నారు. రాజకీయాల్లో తన సమకాలికుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పట్టుకుని అనరాని మాటలు అన్నారు. ఆ మాటలతో కుప్పం ప్రజలు నివ్వెరపోయారు. 2019 ఎన్నికల్లో ఏ నాయకులపైన ప్రజలు తిరగబడ్డారో ఆ టీడీపీ నాయకులు మున్సిపల్‌ ఎన్నికల్లో చక్రం తిప్పారు. వీరి కుట్రలు, మోసాలను తెలిసిన కుప్పం ఓటర్లు ఫలితాల్లో తెలుగుదేశం నడ్డి విరిచారు. 

ఏ నాయకుడికైనా కావాల్సింది ప్రజల విశ్వాసం అది కోల్పోయినవాడు నాయకుడే కాదు. ఉత్తుత్తి మాటలతో, శూన్య హస్తాలతో ఎవరూ అన్ని వేళలా ప్రజలను మోసం చేయలేరు. కొంతకాలమే అందరినీ మోసం చేయగలరు. వయసు పెరిగేకొద్దీ చంద్రబాబు ఎందుకో ప్రజల అవి శ్వాసం పూర్తిగా కోల్పోతున్నారు. కారణాలు ఇప్పటికీ ఆయన విశ్లేషించుకోవడం లేదు. పచ్చ పత్రికలు ఉన్నాయి కదా అని అవాకులు చవాకులు మాట్లాడి సంబరపడకూడదు. నానాయాగీ చేసినంత మాత్రాన విజయం వరించదని కుప్పం తీర్పే తెలుపుతున్నది. తెలుగుదేశం పార్టీ ఎంతో రచ్చ చేసింది. చివరికి కోర్టు తలుపులు కూడా తట్టి కౌంటింగ్‌కు అబ్జర్వర్‌ను పెట్టేలా చేశారు. ఎన్ని విమర్శలు చేసినా, కోర్టులు చెప్పినా ప్రజలు మాత్రం ‘జై జగన్‌’ అన్నారు. కుప్పంలో వైఎస్సార్‌సీపీ గెలుపును చంద్రబాబు కలలో కూడా ఊహించలేదు. తెలుగుదేశం కేవలం ఆరు స్థానాలలో గెలిచి, చావుతప్పి కన్నులొట్టపోయినట్లు అయింది. చంద్రబాబు కలల కంచుకోట పేకమేడలా కూలిపోయింది. 

కుప్పం విజయం పూర్తిగా ఇద్దరికీ చెందుతుంది. ఒకరు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి, మరొకరు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నవరత్నాల పథకాల ద్వారా కుప్పంలోని ప్రతి వ్యక్తి మనసును జగన్‌ గెలుచుకున్నారు. ఇక ప్రజలను పోలింగ్‌ స్టేషన్ల వైపు పరుగులెత్తించిన ఘనత పెద్దిరెడ్డిదే. కుప్పంలో ఎక్కువ శాతం మంది పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన వారే. కుప్పం పట్టణంలోని ప్రతి ఇంటికి జగన్‌ ఫలాలు అందాయి. ఎక్కడున్నా, ఏ ఇంట్లో వున్నా, పింఛన్లుగానీ, రైతు భరోసా డబ్బులు కానీ కరెక్ట్‌గా అందడంతో కుప్పం ప్రజల్లో జగన్‌ పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంచింది. 

రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. చంద్రబాబు ఇంతకాలం కుప్పంలో హాయిగా గుర్రపు స్వారీ చేస్తూ వచ్చారు. ఆయన గుర్రం అలసి సొలసి చెక్క గుర్రంగా మారి చతికిలపడింది. చంద్రబాబు తన తప్పులు తాను తెలుసుకోకుండా జగన్‌ని తిట్టడమే ప్రధానంగా పెట్టుకోవడం చాలా తప్పు. గెలిస్తే తమ సామర్థ్యం, ఓడితే ఎదుటివారి దౌర్జన్యం, గూండాగిరి అని చెప్పడం ఏ పార్టీకైనా తగదు. జగన్‌ అధికారం చేపట్టి 30 నెలలు అవుతున్నది. ఇప్పటికైనా తెలుగుదేశం ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. మూస ధోరణిలో వెళితే ఆ పార్టీకి నూకలు చెల్లినట్లే. కుప్పం ప్రజలకు చంద్రబాబు దూరమై, తాగునీరు, కనీస అభివృద్ధి కూడా చేయక, హంద్రీ–నీవా నీళ్లు తెప్పిస్తానన్న మాట వమ్ముచేసి ప్రజల్లో తన స్థానాన్ని కోల్పోయారు. 

వైఎస్‌ జగన్‌ 2019లానే జనం హృదయాల్లో ఇప్పటికీ నిలిచి ఉన్నారు. ‘ప్రజలే దేవుళ్ళు’ అని ఎన్టీఆర్‌ ప్రతి సభలో చెప్పేవారు. ఆ మాటల్ని పూర్తిగా నిజం చేస్తున్న వ్యక్తి జగన్‌. పెద్దిరెడ్డి కుప్పంలో వైసీపీ జెండా ఎగరేసి చంద్రబాబు కుంభస్థలాన్ని కొట్టారు. దీంతో చంద్రబాబు నిర్మించుకున్న సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయింది. ఓటమిని తెలుగుదేశం పార్టీ సమగ్రంగా విశ్లేషణ చేసుకోవడం మాని మాకు 13 శాతం ఓట్లు పెరిగాయి అని డంబాలు పలకడం వారికే నష్టం. ఓట్ల శాతాలు చర్చలకు పనికొస్తాయి తప్ప ప్రజలకు ఉపయోగపడవు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థలను మేనేజ్‌ చేయడంతోనో, పచ్చపత్రికల ప్రచారంతో సంబరపడటమో మాని ప్రజల్లోకెళ్లి వాళ్లతో మమేకమై హృదయాన్ని చూరగొనాలి.

డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ 
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)