సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
సామాజిక సాధికార యాత్రను జయప్రదం చేద్దాం
Published on Tue, 11/14/2023 - 01:02
● ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్
పొన్నూరు: ఈనెల 15న పొన్నూరులో వైఎస్సార్ సీపీ చేపడుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కోరారు. పొన్నూరు పట్టణంలో యాత్ర జరిగే రూట్, సభా వేదిక స్థలాన్ని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు గుత్తికొండ అంజిరెడ్డి, అన్నా బత్తుని సదాశివరావు సోమవారం పరిశీలించారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ రాజశేఖర్ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి గెలిపించుకుని ఆయన రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎమ్మెల్యే రోశయ్య మాట్లాడుతూ ఈనెల 15న పొన్నూరులో సాయంత్రం నాలుగు గంటల నుంచి జరిగే యాత్ర సమాచారాన్ని గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. అంజిరెడ్డి, సదాశివరావు మాట్లాడుతూ సీఎం జగన్పై ఉన్న అభిమానంతో ప్రజలే స్వచ్ఛందంగా తరలివచ్చి యాత్రను జయప్రదం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యులు షేక్ సైఫుల్లా, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు మాదా రాధా, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షుడు షేక్ మహమ్మద్, రుద్రపాటి ఆదిశేషులు, ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ దాసరి నారాయణరావు, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెరికల కృష్ణమోహన్, మండల జేసీఎస్ కన్వీనర్ భవనం వంశీరెడ్డి, పట్టణ జేసీఎస్ కన్వీనర్ అమిరినేని సాంబశివరావు, నాయకులు బొద్దులూరి రంగారావు, వట్టిప్రోలు రంగారావు, షేక్ సుభాని పాల్గొన్నారు.
Tags