ఎల్లో మీడియా కుట్రలు..బద్దలు కొట్టిన సీఎం జగన్..
Breaking News
ముగిసిన రాష్ట్రస్థాయి అండర్–14 సాఫ్ట్బాల్ పోటీలు
Published on Tue, 11/21/2023 - 02:08
పెదకాకాని: క్రీడాకారులు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని చేసుకోవాలని జడ్పీటీసీ సభ్యురాలు గోళ్ల జ్యోతి అన్నారు. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభమైన మూడు రోజుల సాఫ్ట్బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. 67వ ఏపీ ఎస్జీఎఫ్ఐ రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలకు అండర్ –14 బాలబాలికల విభాగాలలో 13 జిల్లాల నుంచి 476 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా బాలుర జట్టు విన్నర్గా ప్రథమ స్థానంలో నిలవగా రన్నర్గా కడప జట్టు కై వసం చేసుకుంది. తృతీయ స్థానంలో నెల్లూరు జిల్లా జట్టు నిలిచింది. అలాగే అండర్–14 బాలికల విభాగంలోనూ విజయనగరం జిల్లా జట్టు విన్నర్ కాగా అనంతపురం జట్టు రన్నర్గా నిలిచింది. గుంటూరు జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. విజేతలకు మెడల్స్ బహూకరించడంతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. విన్నర్, రన్నర్ స్థానాల్లో నిలిచిన జట్లకు గోల్డ్కప్లు అందజేశారు. అనంతరం జాతీయ స్థాయిలో జరిగే సాఫ్ట్బాల్ పోటీలకు అండర్–14 బాల బాలికల రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పేరం మస్తాన్ రెడ్డి తెలియజేశారు. ఈ పోటీల విజేతలకు రాష్ట్ర పాఠ్యపుస్తకాల డైరెక్టర్ కె.రవీంద్రనాథ్ రెడ్డి, గ్రామ సర్పంచి వేల్పుల శ్రావణి, లంకా క్రాంతిశేఖర్, సీఐ బండారు సురేష్బాబులు బహుమతులు అందజేశారు. పాఠశాల హెచ్ఎం నంబూరు తిరుపతిరావు, పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ కె.నాగజ్యోతి, జిల్లా సాఫ్ట్బాల్ కన్వీనర్ జగదీశ్వరరెడ్డి, టోర్నమెంట్ పరిశీలకులు హృదయ రాజు, జయరావు, ఎస్.వెంకట్రెడ్డి, స్పోర్ట్స్ మేనేజర్లు, వ్యాయామోపాధ్యాయులు, కోచ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాలికల విన్నర్ విజయనగరం, రన్నరప్గా అనంతపురం బాలుర విభాగంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విజయనగరం, వైఎస్సార్ కడప జట్లు
Tags