amp pages | Sakshi

10 నిమిషాల అంతరిక్ష యాత్ర కోసం రూ.205 కోట్లు ఖర్చు

Published on Sun, 06/13/2021 - 15:46

మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలను మరింత సులువు చేయడం కోసం స్పేస్‌ ఎక్స్‌, బ్లూ ఆరిజిన్‌ లాంటి దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్న విషయం అందరికి తెలిసిందే. స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి మానవ సహిత అంతరిక్ష యాత్రలను దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. కేవలం అంతటితో ఆగకుండా అంగారక గ్రహంపై కాలనీలు ఏర్పాటు చేయాలని కూడా చూస్తుంది. ఎలన్‌ మస్క్ కంపెనీ స్పేస్‌ ఎక్స్ ఇప్పటికే ఆ దిశగా అంతరిక్షనౌక ప్రయోగాలపై దృష్టిసారించింది.

ఇది ఇలా ఉంటే మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల్లో జెఫ్‌ బెజోస్‌ కంపెనీ బ్లూ ఆరిజిన్‌ సంస్థ కూడా కీలక ఘట్టానికి చేరుకుంది. బ్లూ ఆరిజిన్‌ తన తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని నిర్వహించడానికి సిద్థమైంది. ఈ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రలో ఆస్ట్రోనాట్స్‌తో పాటు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, అతని సోదరుడు మార్క్‌ బెజోస్‌తో కలిసి ప్రయాణించనున్నాడు. అయితే తాజాగా జెఫ్‌ బెజోస్‌ కలిసి అంతరిక్ష యాత్ర చేయడానికి మరో సీట్ కోసం శనివారం ఒక ప్రత్యక్ష వేలం జరిగింది. 

ఈ ప్రత్యక్ష వేలం ప్రారంభమైన నాలుగు నిమిషాల్లో బిడ్లు 20 మిలియన్ల డాలర్లకు పైగా కోట్ చేశారు. చివరకి వేలం ప్రారంభమైన 7 నిమిషాల తర్వాత 28 మిలియన్ డాలర్ల(రూ.205 కోట్లు)తో బిడ్డింగ్ ముగిసింది. అయితే, అంత మొత్తం వేలం వేసిన అతని పేరు బయటకి సంస్థ బయటకి వెల్లడించలేదు. జూలై 20న వెస్ట్ టెక్సాస్ నుంచి బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ బూస్టర్ అంతరిక్ష కక్ష్యలోకి వెళ్తుంది. కాగా ఈ ప్రయోగం కేవలం పది నిమిషాల వ్యవధిలో పూర్తి కానుంది. ఈ బిడ్డింగ్ లో 143 దేశాల నుంచి 6,000 మందికి పైగా ఎంట్రీలు వచ్చినట్లు బ్లూ ఆరిజిన్ తెలిపింది.

చదవండి: పాన్‌ - ఆధార్‌ లింకు గడువు కొద్ది రోజులే!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)