amp pages | Sakshi

విషం చిమ్మిన చైనా.. తీవ్ర వ్యాఖ్యలు

Published on Fri, 08/14/2020 - 14:28

బీజింగ్‌/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడి 20 మంది భారత సైనికుల ప్రాణాలు బలిగొన్న చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. గల్వాన్‌ లోయలో ఘర్షణలు తలెత్తడానికి భారత ఆర్మీ చర్యలే కారణమంటూ విషం చిమ్మింది. మరోసారి ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత్‌లో చైనా రాయబారి సన్‌ వెడాంగ్‌ జూన్‌ 15 నాటి ఘటనకు సంబంధించి చైనీస్‌ ఎంబసీ మ్యాగజీన్‌లో తన అభిప్రాయాన్ని ప్రచురించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది.(చైనా తీరును ఖండిస్తూ సెనేట్‌లో తీర్మానం)

‘‘ఈ ఘటనను పూర్తిగా విశ్లేషించినట్లయితే ఇందుకు చైనా బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని స్పష్టమవుతోంది. భారత దళాలే వాస్తవాధీన రేఖను దాటి ముందుకొచ్చి రెచ్చగొట్టడమే గాకుండా చైనా బలగాలపై దాడి చేశాయి. సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత బలగాలు పూర్తిగా ఉల్లంఘించాయి. నిబంధనలను తుంగలో తొక్కి అంతర్జాతీయ సంబంధాలకు తూట్లు పొడిచాయి. ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపించి, చట్టాలు అతిక్రమించిన ఫ్రంట్‌లైన్‌ బలగాలపై భారత ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుని జవాబుదారీగా ఉండేలా చూడాలి. అంతేగాక వారు రెచ్చగొట్టే చర్యలు ఆపినపుడే మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయి’’అని సన్‌ వెడాంగ్‌ తన ఆర్టికల్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.(డ్రాగన్‌ దూకుడు : భారత్‌ దిగుమతులపై సుంకాల పొడిగింపు) 

కాగా జూన్‌ 14 అర్ధరాత్రి డ్రాగన్‌ ఆర్మీ గల్వాన్‌ లోయలో ఎల్‌ఏసీ వెంబడి ఉద్రిక్తతలు సృష్టించిన నేపథ్యంలో భారత ఆర్మీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారత సైనికులు అసువులు బాశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పలు దఫాలుగా దౌత్య, సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. పరస్పర అంగీకారంతో సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి మళ్లించేందుకు ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి తరుణంలో సన్‌ వెడాంగ్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు.. గల్వాన్‌ లోయ ఘర్షణలో మరణించిన సైనికుల వివరాలను చైనా ఇంతవరకు వెల్లడించలేదు. అంతేగాక వారికి కనీసం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయకుండా అవమానించిందని అమెరికా ఇంటలిజెన్స్‌ వర్గాలు పేర్కొన్న విషయం విదితమే.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)