amp pages | Sakshi

షాంఘైలో కొత్త రకం కరోనా కల్లోలం.. చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం!

Published on Tue, 03/29/2022 - 18:39

ఇటీవలే కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్నామని ప్రపంచ దేశాలు ఊపరి పీల్చుకుంటున్నాయి. ఈ క్రమంలో కోవిడ్‌ పుట్టినిల్లైన చైనాలో తాజాగా కొత్త కరోనా వేరియంట్‌కి సంబంధించిన కేసులు అనుహ్యంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చైనా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ వైరస్‌ విజృంభణ చూస్తే ఇప్పడప్పుడే అదుపులోకి వచ్చే పరిస్థితి ఏ మాత్రం కనబడటం లేదు. చివరికి రోజువారీ కోవిడ్ కేసులు మంగళవారం రికార్డు స్థాయిలో 4,477కి పెరగడంతో షాంఘై నగరం తూర్పు భాగంలో నివసించే ప్రజలకు లాక్‌డౌన్ పరిమితులను విధించింది చైనా ప్రభుత్వం. 

ఆ ప్రాంత ప్రజలు కేవలం కోవిడ్ పరీక్ష కోసం మాత్రమే బయటకు రావాలని ఉత్తర్వులు జారీ చేసింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్తో పాటు ఫైనాన్షియల్ సంస్థలకు పేరున్న పుడోంగ్ జిల్లాలో కోవిడ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో అక్కడి స్థానిక అధికారులు ఆ ప్రాంతంలో లాక్డౌన్ విధించారు. వైరస్‌ వ్యాప్తి అరికట్టేందుకు నివాసితులు బయటకు రావడం, బహిరంగ ప్రదేశాలలో తిరగడం నిషేధమని, షాంఘై మున్సిపల్ హెల్త్ కమిషన్ అధికారి తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. హాల్ వేస్, ఓపెన్ ఏరియాల్లు, రెసిడెన్షియల్ కాంపౌండ్స్లో కనీసం వాకింగ్ చేసేందుకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. గతంలో నివాసితులు తమ భవనాల లాబీలోకి వెళ్లి కూర్చునే అవకాశం ఉండేది. అలానే తమ పరిసర ప్రాంతాల్లో వైరస్‌ సోకిన వారు లేకపోతే ఆ ప్రాంతంలోనూ నిక్షేపంగా సంచరించే అవకాశం ఉండేది. అయితే కేసులు విపరీతంగా పెరిగేసరికి కేవలం ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ప్రజలను ఆదేశించింది.

చదవండి: ఉక్రెయిన్‌ మహిళపై రష్యా సైనికుల దురాగతం...ఆమె భర్తను చంపి, వివస్త్రను చేసి..

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)