amp pages | Sakshi

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం: విడిచి వెళ్లాలా? వద్దా?

Published on Sun, 03/06/2022 - 09:55

న్యూఢిల్లీ: నగరం విడిచి, దేశ సరిహద్దులకు వెళ్దామంటే దాడుల భయం.. ఎప్పుడు ఏ క్షిపణి దాడికి బలైపోతామో తెలియదు. ఇక్కడే ఉందామంటే తినడానికి తిండిలేదు, తాగడానికి నీరులేదు. పైగా రక్తం గడ్డ కట్టించే చలి పులి భయపెడుతోంది. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో తలదాచుకుంటున్న భారతీయుల దీనస్థితి ఇది. ఉండాలో వెళ్లిపోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. సుమీపై రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. క్షిపణుల వర్షం కురిపిస్తోంది.

జనం అండర్‌గ్రౌండ్‌ స్టేషన్లలో, బంకర్లలో ఉం టూ బిక్కుబిక్కుమంటూ భారంగా కాలం గడుపుతున్నారు. బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదని చెబుతున్నారు. మరోవైపు ఆహారం డొక్కలు ఎండిపోతున్నాయి. ప్రాణాలు దక్కాలంటే తిండి కావాలి. ఎలాగోలా సరిహద్దులకు చేరుకుంటే తప్ప తిండి దొరకదు. కానీ, భీకర యుద్ధం సాగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా రిస్క్‌ చేయొద్దని భారత విదేశాంగ శాఖ సూచించింది.

సుమీలో దాదాపు 700 మంది భారత విద్యార్థులు ఉన్నారు. వారిని బయటకు తరలించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. విద్యార్థులు సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. మంచు కరిగించి, నీటిగా మార్చి తాగుతున్నామని వారు చెప్పారు. ఇంకా ఇక్కడే ఉండలేమని, తమను వెంటనే రక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. 

నేడు భారత్‌కు 2,200 మంది రాక!
ఉక్రెయిన్‌ పొరుగు దేశాల నుంచి ఆదివారం 13 విమానాలు భారత్‌కు రానున్నాయని, వీటిలో 2,200 మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటారని పౌర విమానయాన శాఖ తెలియజేసింది. శనివారం 15 విమానాల్లో 3,000 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో 12 ప్రత్యేక పౌర విమానాలు, 3 భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) విమానాలు ఉన్నాయని వెల్లడించింది. ఇండిగో, ఎయిర్‌ ఇండియా, విస్తారా, స్పైస్‌జెట్‌ సంస్థలు పౌర విమానాలను పంపిస్తుండగా, ఐఏఎఫ్‌ సి–7 సైనిక రవాణా విమానాలను ఉక్రెయిన్‌ పొరుగు దేశాలైన హంగేరి, రొమేనియా, స్లొవేకియా, పోలండ్‌కు పంపిస్తోంది.

(చదవండి: పుతిన్‌ సైన్యం వీళ్లే!)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌