Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హాంకాంగ్లో మీడియాపై... జాతీయ భద్రతా చట్టం ప్రయోగం
Published on Fri, 06/18/2021 - 04:01
హాంకాంగ్: చైనా పాలకుల కర్కశత్వానికి మరో తార్కాణం. హాంకాంగ్లో ప్రజాస్వామ్య గళాలను అణచివేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని తొలిసారిగా మీడియాపై ప్రయోగించారు. యాపిల్ డైలీ అనే పత్రికకు చెందిన ఐదుగురు ఎడిటర్లు, కార్యనిర్వాహకులను పోలీసులు ఈ చట్టం కింద గురువారం అరెస్టు చేశారు. ఈ పత్రికలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమ వార్తలను ప్రచురిస్తుంటారు. హాంకాంగ్కు చైనా చెర నుంచి విముక్తి లభించాలని, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కావాలని యాపిల్ డైలీ గట్టిగా నినదిస్తోంది. చైనా, హాంకాంగ్పై ఇతర దేశాలు ఆంక్షలు విధించేలా కుట్ర పన్నడమే ధ్యేయంగా 30కిపైగా ఆర్టికల్స్ను ఈ పత్రిక ప్రచురించినట్లు ఆధారాలున్నాయని పోలీసులు వెల్లడించారు.
#
Tags