amp pages | Sakshi

‘చైనా’ నుంచి ఎల్లోడస్ట్‌; ఉ. కొరియా వార్నింగ్‌!

Published on Fri, 10/23/2020 - 21:31

ప్యాంగ్యాంగ్‌: ప్రపంచమంతా కరోనా వైరస్‌ ధాటికి వణికిపోతున్న తొలినాళ్లలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం తన రూటే సపరేటు అన్నట్లు వ్యవహరించారు. చైనాలోని వుహాన్‌ నగరంలో మహమ్మారి ఆనవాళ్లు బయటపడిన నేపథ్యంలో దేశ సరిహద్దులను మూసివేసి.. అందరినీ ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బయటకు వస్తే మరణమే శరణ్యం అనే పరిస్థితులు కల్పించారు. అంతేకాదు తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటూ అధికార మీడియా వేదికగా ప్రకటనలు జారీ చేశారు. అయితే జూలై నాటికి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. అప్పటికే కిమ్‌ అనారోగ్య వార్తల నేపథ్యంలో, వాటిని కొట్టిపారేసే విధంగా ఆయన సమావేశాల్లో పాల్గొన్నట్లుగా ఫొటోలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో జూలై 25 తర్వాత తమ దేశంలో తొలి కరోనా కేసు నమోదు వెల్లడైనట్లు ప్రకటన వెలువరించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కిమ్‌, కోవిడ్‌ కేసు వెలుగుచూసిన కేసాంగ్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించేలా ఆదేశాలు జారీచేశారు. (చదవండి: 5 వ్యాక్సిన్లు : 100 కోట్ల డోసులు  )

ఇక ఇటీవల జరిగిన అధికార వర్కర్స్‌ పార్టీ 75వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని మిలటరీ పరేడ్‌లో పాల్గొన్న కిమ్‌, దేశంలో కరోనా వైరస్‌ ముప్పుని తొలగించడంలోనూ, వరద పరిస్థితులు తలెత్తినప్పుడు చేసిన సాయాన్ని గుర్తుచేస్తూ సైనికులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో విఫలమయ్యానంటూ ఉద్వేగానికి లోనై కంటతడి పెడుతూ, జాతిని క్షమాపణ కోరిన వీడియోను స్థానిక మీడియా ప్రసారం చేసింది. నియంతలా వ్యవహరిస్తూ, ఎల్లప్పుడూ ప్రజల్ని తన అదుపాజ్ఞల్లో ఉంచే కిమ్‌కు సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఉత్తర కొరియా అధికార మీడియా జారీ చేసిన మరో ప్రకటన స్థానిక ప్రజల గుండెల్లో గుబులుపుట్టిస్తోంది. మరోసారి కరోనా భయం వారిని వెంటాడుతోంది. 

ఎల్లో డస్ట్‌తో కరోనా ఆగమనం?!
చైనీస్‌, మంగోలియన్‌ ఎడారుల మీదుగా వీచే పవనాలు మోసుకొస్తున్న ఇసుక, దుమ్మధూళి కణాలతో ప్రాణాంతక కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఉత్తరకొరియా బుధవారం హెచ్చరికలు జారీచేసింది. బహిరంగ కార్యకలాపాలన్నింటిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు ఇవ్వడంతో రాజధాని ప్యాంగ్యాంగ్‌ మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. ‘‘దుష్ట, హానికరమైన వైరస్‌ల రాకతో ప్రమాదం పొంచి ఉన్నందున కార్మికులంతా ఇళ్లల్లోనే ఉండాలంటూ’’ అధికార వార్తా పత్రిక ద్వారా ప్రజలను అప్రమత్తం చేసింది.

అదే విధంగా యెల్లో డస్ట్‌ ప్రమాదం గురించి వివిధ రాయబార కార్యాలయాలకు సైతం సమాచారం ఇచ్చింది. ఈ విషయం గురించి ప్యాంగ్యాంగ్‌లోని రష్యన్‌ ఎంబసీ తన ఫేస్‌బుక్‌ పేజీలో వెల్లడించింది. ఇసుక తుపానులతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయినట్లు పేర్కొంది. అందరూ ఇంటికే పరిమితం కావాలని, తలుపులు, కిటికీలు బిగించుకోవాలని సూచించినట్లు తెలిపింది. 

కాగా కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్న వార్తల నేపథ్యంలో, మిత్రదేశం చైనా ఎడారుల నుంచి తమ భూభాగం మీదకు కొట్టుకువస్తున్న ఎల్లోడస్ట్‌ మరింత హానికరంగా మారే ప్రమాదం ఉందని ఉత్తర కొరియా వాదిస్తుంటే, దక్షిణ కొరియా మాత్రం ఈ హెచ్చరికలను కొట్టిపారేస్తోంది. ధూళికణాల ద్వారా కోవిడ్‌ వ్యాపించే అవకాశం లేదని అభిప్రాయపడుతోంది. ఇక కరోనా వైరస్‌ గాలిలో కొన్ని గంటలపాటే నిలిచి ఉంటుందని అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఉత్తరకొరియాతో పాటు తుర్కెమిస్తాన్‌ కూడా తన ప్రజలకు ఇదే తరహా ఆదేశాలు జారీ చేసినట్లు బీబీసీ డిస్‌ఇన్‌ఫర్మేషన్‌ టీం వెల్లడించింది. కాగా ఏటా నిర్దిష్ట కాలాల్లో ఉభయ కొరియా భూభాగాల మీదకు చైనా ఎడారుల నుంచి వీచే ఎల్లోడస్ట్, ప్రజల్లో ఆరోగ్య సంబంధిత ఆందోళనలకు కారణమవుతోంది.

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)