amp pages | Sakshi

ఖలిస్తానీ ఉగ్రవాది హత్యకు కుట్ర.. తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

Published on Wed, 12/20/2023 - 16:06

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌' నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్ హత్యకు కుట్ర కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు.  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. ఇతర దేశాల్లోని మా భారత పౌరులు చెడు పనులు చేసినట్లు తమకు సమాచారం అందిస్తే.. వాటిని తాము పరిశీలిస్తామని తెలిపారు. తగిన ఆధారాలు అందిస్తే విచారణ జరిపేందుకు సహకరిస్తామని తెలిపారు. 

అదే విధంగా భారత్‌- అమెరికా మధ్య సంబంధాలలో భద్రత, ఉగ్రవాద వ్యతిరేక సహకారం కీలకమైన అంశమని మోదీ పేర్కొన్నారు. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలను ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా విదేశాలలో తీవ్రవాద సంస్థల కార్యకలాపాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్నారని, హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు.

కాగా అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర జరిగిందని, దీనిని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పన్నూన్‌ హత్యకు కుట్రలో  52 ఏళ్ల నిఖిల్‌ గుప్తా అనే భారత పౌరుడి ప్రమేయం ఉందంటూ యూఎస్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అతనిపై అభియోగాలు మోపారు. గుప్తా భారత ప్రభుత్వ ఏజెన్సీ ఉద్యోగితో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. అతన్ని చెక్ రిపబ్లిక్‌లో అదుపులోకి తీసుకున్నారు.
చదవండిఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్‌ మళ్లీ డుమ్మా?.. కారణమిదే!

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)