Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)
Breaking News
అతివ.. ఒక్కసారే
Published on Sat, 11/18/2023 - 01:42
అలంపూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే మహిళా ఎమ్మెల్యేగా చలామణి అయ్యారు. 1952లో అలంపూర్ అసెంబ్లీ స్థానంగా మారింది. 1952, 1953లో రెండుస్లారు ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎన్నికల్లో పురుష అభ్యర్థులే బరిలో నిలిచి గెలిచారు. 1957లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి జయలక్ష్మిదేవమ్మ బరిలో నిలిచారు. ఆమైపె జనార్దన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన జయలక్ష్మిదేవమ్మకు 13,345 ఓట్లు పోల్ అవ్వగా స్వతంత్ర అభ్యర్ధి జనార్థన్ రెడ్డికి 13,267 ఓట్లు వచ్చాయి. కేవలం 78 ఓట్ల మేజారీతో జయలక్ష్మిదేవమ్మ విజయం సాధించింది. తక్కువ మెజార్టీ అయినప్పటికి ఒక మహిళకు విజయ అవకాశం దక్కింది. ఆ తర్వాత 1983లో లక్ష్మిసరోజినిదేవి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా రజనీబాబు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 33,011 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రజనీబాబుకు 35,979 ఓట్లు పోలయ్యాయి. 2,968 అత్యల్ప ఓట్ల తేడాతో ఓటమి చూడాల్సి వచ్చింది. 1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అనుసూయమ్మ బరిలో నిలిచింది. బీజేపీ అభ్యర్థిగా రావుల రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అనసుయమ్మకు 25,709 ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థికి 37910 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థి 12201 ఓట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా వావిలాల సునీత పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్థిగా చల్లా వెంకట్రామిరెడ్డి పోటీచేసి 4447 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత మహిళా అభ్యర్థులు పోటీ చేసిన సందర్భాలు కానరాలేదు.
Tags