"కూటమి కట్టినా ఓటమి తప్పదు"
Breaking News
సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి
Published on Sat, 11/18/2023 - 01:42
రాజోళి/కేటీదొడ్డి: ఎన్నికల సందర్భంగా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నగదు, మద్యం, బంగారు తదితర వస్తువులు రవాణా జరిగే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల పరిశీలకుడు అనుపమ్శర్మ అన్నారు. శుక్రవారం రాజోళిలోని సుంకేసుల డ్యాం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ఆయన తనిఖీ చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. పటిష్ట నిఘా ఏర్పాటుచేయాలన్నారు. ఇప్పటివరకు ఎంత నగదు, ఎంత మద్యం పట్టుకున్నారనే వివరాలు అ డిగి తెలుసుకున్నారు. ఏపీకి సరిహద్దులో ఉండటంతో డబ్బు,నగదు సరహిద్దు దాటే అవకాశాలుంటాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విస్తృత తనిఖీ
కేటీదొడ్డి: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు వాహనాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సోమవారం మండలంలోని రాష్ట్ర సరిహద్దు నందిన్నె చెక్పోస్టును ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ పోలీసుల ఆధ్వర్యంలోని తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మద్యం, డబ్బులు రాకుండా అధికారులు గట్టి బందోబస్తుతోపాటు తనిఖీలు చేపట్టారు.
Tags