amp pages | Sakshi

అయ్యో.. నాగలక్ష్మి.. ఇలా చేశావేంటి?

Published on Thu, 03/23/2023 - 00:44

కరీంనగర్: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు బాగా రాయలేకపోయాననే మనస్తాపంతో కాల్ల నాగలక్ష్మి(16) బుధవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కాల్ల రామయ్య – నర్సవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్నకూతురు నాగలక్ష్మి. మల్యాల మండలం నూకపెల్లి మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. సోమవారం మల్యాలలో బోటనీ పరీక్ష రాసింది. అయితే, పరీక్ష బాగా రాయలేదని మనస్తాపానికి గురైంది.

ఇదే విషయాన్ని తన స్నేహితులతో చెప్పింది. పరీక్ష మంచిగారాసి ఉగాది పండుగకు ఇంటికి రావాలని తల్లిదండ్రులు కోరారు. ఈ క్రమంలో మంగళవారం బాలిక ఇంటికి చేరుకుంది. వచ్చినప్పటి నుంచి నాగలక్ష్మి ముదావహంగా ఉంటోంది. భోజనం కూడా సరిగా చేయడంలేదు. తల్లిదండ్రులు ఆరా తీయగా, తాను పరీక్ష బాగా రాయలేకపోయానని రోదిస్తూ తెలిపింది. ఏం ఫర్వాలేదని, ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులు బాలికకు సూచించారు. ఈక్రమంలో బుధవారం ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటి ఎదుట వాకిట్లో ముగ్గులు వేసిన నాగలక్ష్మి.. ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లింది. మధ్యాహ్నం వరకూ ఆమె కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు పరిసరాల్లో గాలించారు. బంధువులకు సమాచారం అందించారు.

ఎక్కడా ఆచూకీ లభించలేదు. గోదావరినది వైపు నాగలక్ష్మి వెళ్లిందని స్థానికులు వారికి చెప్పారు. దీంతో తల్లిదండ్రులు అటువైపు వెళ్లి చూడగా, గోదావరి ఒడ్డున నాగలక్ష్మి చెప్పులు కనిపించాయి. నదిలో దూకి ఉంటుందనే అనుమానంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జాలర్లసాయంతో నీటిలో గాలించగా నాగలక్ష్మి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతిరాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాజు తెలిపారు. కొడుకులు లేకున్నా.. ఇద్దరు కూతుళ్లే సర్వస్వం అనుకున్న ఆ తల్లిదండ్రులు.. చిన్నకూతురు మృతితో విషాదంలో మునిగారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)