ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు
Breaking News
ఇంటి నిర్మాణంలో ప్రమాదం
Published on Sun, 03/26/2023 - 01:26
యశవంతపుర: సెంట్రింగ్ పని చేస్తుండగా మట్టి చరియలు విరిగి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా గురుంపు వద్ద జరిగింది. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కార్మికులు సెంట్రింగ్ పని చేస్తుండగా ఒక్కసారిగా మట్టి చరియలు విరిగి పడ్డాయి. ఘటనలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ కార్మికురాలు మట్టిలో చిక్కుకొని మృతి చెందారు. ఫైర్, పోలీసులు జేసీబీ సాయంతో తవ్వి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు గదగ జిల్లా ముండరిగికి చెందిన వలస కూలీలు సోమశేఖర్, ఆయన భార్య శాంత ఉన్నారు. మరో యువకుని వివరాలు తెలియవలసి ఉంది. అబూబకర్ అనే వ్యక్తి ఇంటిని నిర్మిస్తున్నారు. మట్టి చరియలు విరిగి ఇంటిపై పడకుండా ఉండడానికి వెనుక వైపు మట్టి చరియలను తవ్వి పిల్లర్ సాయంతో గోడను నిర్మిస్తున్నారు. ఈ సమయంలో దుర్ఘటన జరిగింది. మృతదేహాలను సుళ్య ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని మంత్రి ఎస్ అంగార పరిశీలించారు.
ముగ్గురు కూలీలు సజీవ సమాధి
Tags