amp pages | Sakshi

మహిళలకు నో టికెట్‌

Published on Wed, 05/31/2023 - 06:26

కర్ణాటక: కాంగ్రెస్‌ ఐదు గ్యారంటీలలో ఒకటైన ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఎలాంటి షరతులు లేవు, ఉచితంగా బస్సుల్లో రాష్ట్రమంతటా ప్రయాణించవచ్చని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. మంగళవారం బెంగళూరులో ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో 4 ఆర్టీసీ కార్పొరేషన్‌ల అధికారులతో ఆయన సమావేశం జరిపారు. తరువాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి.. ఉచిత బస్సు ప్రయాణానికి ఎలాంటి నియమాలు ఉండవన్నారు.

ఏపీఎల్‌, బీపీఎల్‌ ఏం వద్దు
ఏపీఎల్‌, బీపీఎల్‌ అర్హత ఉండాలని చెప్పలేదని, అందుచేత ఆర్టీసీలో వనితలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. దీనిపై బుధవారం సీఎం వివరాలను ప్రకటిస్తారన్నారు. దీనికయ్యే ఖర్చును, ఆర్టీసీపై పడే భారాన్ని సీఎంకు వివరిస్తానన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థినులతో పాటు స్త్రీలకు ప్రయాణం ఉచితమే, ఎలాంటి షరతులు ఉండవని చెప్పారు. అన్ని భరోసాలను తాము నెరవేరుస్తామని, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని తెలిపారు. బీజేపీ నాయకులు గ్యారంటీల గురించి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఆర్టీసీకి రోజుకు రూ.23 కోట్ల ఆదాయం
కాగా, రాష్ట్రమంతటా నాలుగు ఆర్టీసీ కార్పొరేషన్‌లలో మొత్తం 23,978 బస్సులు ఉన్నాయి. ఇందులో 1.04 లక్షల సిబ్బంది ఉన్నారు. నిత్యం 82.51 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మొత్తం 240 డిపోలు ఉండగా, ప్రతి రోజు రూ. 23 కోట్ల ఆదాయం వస్తోంది. సంవత్సరంలో రూ.8946 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి వివరించారు.

గ్యారంటీలపై నేడు మళ్లీ సీఎం భేటీ
శివాజీనగర: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారంటీ పథకాల అమలుపై సీఎం సిద్దరామయ్య వరుసగా అధికారులతో సమావేశాలు జరుపుతున్నారు. జూన్‌ 1 నుంచి అమలు చేయాలని సోమవారం భేటీలో నిర్ణయించారు. ఆ రోజున పథకాల రూపురేఖలు, అర్హుల ఎంపిక పై ప్రకటన చేస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మా మాట్లాడుతూ ఈ ఐదు గ్యారెంటీ పథకం అమలుకు సంవత్సరానికి రూ.52 వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఈ నిధుల సేకరణకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని విషయమై బుధవారం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు విధానసౌధలో సమావేశం నిర్వహిస్తారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)