సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
స్థల వివాదంలో ఆత్మహత్యాయత్నం
Published on Tue, 11/14/2023 - 01:00
హోసూరు వార్తలు..
హోసూరు: హోసూరు సమీపంలో పట్టా భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ఆదిద్రావిడ కుటుంబాలకు ఇండ్ల స్థలాలు అందించడాన్ని వ్యతిరేకిస్తూ పురుగుల మందు తాగిన ముగ్గురిలో మహిళ మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల మేరకు సూళగిరి తాలూకా శానమావు గ్రామానికి చెందిన కరియప్పకు చెందిన పట్టా భూమిని గత కొన్ని సంవత్సరాల క్రితం అధికారులు స్వాధీనపరుచుకొని గిరిజన ప్రజలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. తమ భూమిని పంచడాన్ని వ్యతిరేకిస్తూ కరియప్ప కొడుకులు మురుగేష్ (38), మంజునాథ్ (34), కూతురు మాదేవమ్మ (32)లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు గత 8వ తేదీ గిరిజన సంక్షేమ శాఖాధికారి, రెవెన్యూ శాఖాధికార్లు, సర్వేయర్లతో ఘటనా స్థలానికి చేరుకొని గిరిజనులకు అందజేసిన స్థలాలను సర్వేచేయడానికి యత్నించగా వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఉద్దనపల్లి పోలీసులు వీరిని చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. చికిత్స ఫలితంలేక సోమవారం మాదేవమ్మ మృతి చెందింది. మంజునాథ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత బంధువులు ఆందోళన చేపట్టారు.
భారీగా పోలీసు భద్రత
క్రిష్ణగిరి: బంధువులు హోసూరు– రాయకోట రోడ్డు శ్యానమావు వద్ద రోడ్డుపై శవాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. దీంతో శ్యానమావు గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో సూళగిరి డీఎస్పీ మురళి నేతృత్వంలో పెద్దసంఖ్యలో పోలీసులు చేరుకొన్నారు. ప్రభుత్వ అధికార్ల నిర్లక్ష్యం వల్ల ఆస్తిని పోగొట్టుకోవడంతో పాటు ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితి దాపురించిందని బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసులు మోహరించారు. స్థానిక కౌన్సిలర్ సంపంగి ఆందోళన కారులతో మృతదేహాన్ని తీయించారు.
ఆస్పత్రిలో మహిళ మృతి
Tags