ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈశ్వరుని గుడిలో పురాతన బంగారు నిధి
Published on Wed, 11/15/2023 - 00:16
యశవంతపుర: కాఫీతోటలో పురాతన బంగారు అభరణాలు బయట పడ్డాయి. కొడగు జిల్లా సిద్ధాపుర అమ్మతి సమీపంలో ఆనందపుర గ్రామానికి చెందిన టాటా కాఫీ సంస్థకు చెందిన తోటలో పని చేస్తున్న కార్మికులకు ఇవి చిక్కాయి. తోటలోని గుడి వద్ద కార్మికులు పని చేస్తుండగా పురాతన బంగారు ఆభరణాలు దొరికాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తోటలో అతిపురాతన ఈశ్వరుని గుడి ఉంది.
మంగళవారం కార్మికులు అక్కడే పని చేస్తుండగా మట్టిలో ఈ ప్రాచీన బంగారు నిధి బయట పడ్డాయి. వెంటనే కార్మికులు సంస్థ అధికారుల దృష్టికి తెచ్చారు. అందులో పాత ఉంగరం, ఖడ్గం ఉన్నాయి. సిద్ధాపుర పోలీసులు పరిశీలించారు. విరాజపేట తహశీల్దార్ బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏ కాలం నాటివి అనేది పురావస్తు అధికారులు పరిశీలించాల్సి ఉందని తెలిపారు.
#
Tags