వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘అంటే సుందరానికీ’ నిర్మాణ సంస్థపై కేసు నమోదు
Published on Sat, 06/11/2022 - 11:00
అనుమతి తీసుకోకుండానే ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్, శ్రేయాస్ మీడియాపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాని, నజ్రియా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ని గురువారం మాదాపూర్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు.
(చదవండి: ‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ)
అయితే ప్రీరిలీజ్ ఈవెంట్కి పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరో వస్తున్నప్పటీకీ.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా శ్రేయాస్ మీడియా ఈ ఈవెంట్ని నిర్వహించింది. దీంతో నిబంధనలు ఉల్లఘించారంటూ శ్రేయాస్ మీడియా ఈవెంట్ మేనేజర్ సురేశ్తో పాటు మైత్రీ మూవీస్పై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.
#
Tags