ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒక వేడుక.. రెండు వేదికలు
Published on Fri, 02/05/2021 - 00:15
ఈ ఏడాది జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమాన్ని రెండు వేదికల్లో నిర్వహించనున్నారు. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్లో ఏకకాలంలో ఈ వేడుకను జరపాలనుకుంటున్నారు. హాలీవుడ్లో ఆస్కార్ తర్వాత అంతటి ప్రతిష్టాత్మక అవార్డుగా పేరుపొందిన గోల్డెన్ గ్లోబ్ ఫంక్షన్ ఈ నెల 28న జరగనుంది. కోవిడ్ని దృష్టిలో పెట్టుకునే ఇలా రెండు వేదికల్లో ఈ అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు నిర్వాహకులు. 78 ఏళ్ల గోల్డెన్ గ్లోబ్స్ చరిత్రలో ఇలా రెండు చోట్ల వేడుకను నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే ఆస్కార్ వంటి వేరే అవార్డు షోలను రెండు వేదికల్లో నిర్వహించిన సందర్భాలున్నాయి. ఈ వేడుకకు అందరూ హాజరయ్యేలా జరుపుతారా, లేదా వర్చువల్గా నిర్వహిస్తారా అనేది ఇంకా ప్రకటించలేదు.
#
Tags