amp pages | Sakshi

సహ జీవనం.. జూన్‌ 8 వరకు తనతోనే: రియా

Published on Fri, 07/31/2020 - 08:33

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ యువ హీరో బలవన్మరణానికి అతడి ప్రియురాలు రియా చక్రవర్తి ప్రవర్తనే కారణమంటూ బిహార్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. రియా తన కొడుకు నుంచి డబ్బులు లాక్కుని, మోసం చేసి వెళ్లిపోయిందని సుశాంత్‌ తండ్రి క్రిష్ణ కిషోర్‌ సింగ్‌ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బిహార్‌ పోలీసులు విచారణ ప్రారంభించగా.. రియా చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తును బిహార్‌ నుంచి ముంబైకి బదిలీ చేయాలని బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. (రియా చక్రవర్తిపై సంచలన ఆరోపణలు)

ఇందులో సుశాంత్‌తో తన బంధం, అతడి మరణం తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి రియా పిటిషన్‌లో ప్రస్తావించిన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది కాలంగా తామిద్దరం సహజీవనం చేస్తున్నామని కోర్టుకు తెలిపిన ఆమె.. జూన్‌ 8న సుశాంత్‌ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు తెలిపారు. డిప్రెషన్‌తో బాధ పడుతున్న సుశాంత్‌.. దానిని అధిగమించేందుకు మందులు వాడేవాడని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జూన్‌ 14న బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియుడి మరణంతో కుంగిపోయిన తనను కొంత మంది అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. (సుశాంత్‌ కేసు: పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు)

ఇందుకు సంబంధించి ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే సుశాంత్‌ ఆత్మహత్య కేసుకు ముంబై పోలీసులు తన వాంగ్మూలం నమోదు చేశారని, అయినప్పటికీ మరోసారి పట్నాలో కేసు నమోదు కావడం తనను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. సుశాంత్‌ తండ్రికి బిహార్‌లో తన పలుకుబడి ఉపయోగించి కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కేసును మంబైకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా రియాతో బంధం కారణంగానే తన కొడుకు డిప్రెషన్‌లో మునిగిపోయాడని సుశాంత్‌ తండ్రి ఆరోపించిన విషయం తెలిసిందే. (రియాతో బంధం తెంచుకోవాలనుకున్నాడు: అంకిత)

ప్రేమ పేరుతో సుశాంత్‌ను తమకు దూరం చేసిందని, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన తర్వాత తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రియా కూర్గ్‌లో సేంద్రీయ వ్యవసాయం చేయాలని భావించిందని, ఇందు​కు సహకరించకపోతే సుశాంత్‌ కెరీర్‌ను నాశనం చేస్తానని వేధింపులకు గురిచేసినట్లు తమకు తెలిసిందన్నారు. సుశాంత్‌తో మాట్లాడేందుకు తామెంతగా ప్రయత్నించిప్పటికీ రియా అడ్డుపడిందని, చివరికి ఆత్మహత్య చేసుకునేలా తనను ప్రేరేపించిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా..  ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కొట్టి వేస్తూ సర్వోన్నత న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం పోలీసులు విచారించవచ్చని పేర్కొంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)