బాచుపల్లిలో ఘోర ప్రమాదం
Breaking News
మీరే నాకు ఎప్పటికీ ఆదర్శం: మెగాస్టార్ కూతురు ప్రశంసలు
Published on Sun, 01/28/2024 - 16:16
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం లభించింది. 75వ గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ ఘనత అందుకున్న నటుడిగా మెగాస్టార్ నిలిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చిరంజీవికి అభినందనలు తెలిపారు. మెగా కోడలు ఉపాసన సైతం మామయ్యకు కంగ్రాంట్స్ చెబుతూ ట్వీట్ చేసింది.
తాజాగా మెగాస్టార్ పెద్దకూతురు సుస్మిత శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. నాన్న మీరు ఒక స్ఫూర్తి, గౌరవం, ఆశీర్వాదం కూడా. పద్మవిభూషణ్ వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు. అలాదే ఈ ఏడాదిలో పద్మ అవార్డులు దక్కించుకున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేసింది.
Dad, you are an Inspiration, an honour and a blessing. #PadmaVibhushan Heartiest congratulations to all the Padma awards this year. @KChiruTweets pic.twitter.com/jT17b8hdZd
— Sushmita Konidela (@sushkonidela) January 28, 2024
Tags