amp pages | Sakshi

Bharat Jodo Yatra: తీవ్ర విషాదం.. పాదయాత్రలో పాల్గొని సీనియర్‌నేత మృతి

Published on Tue, 11/08/2022 - 17:47

సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో మంగళవారం విషాదం నెలకొంది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కాంగ్రెస్‌ సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్‌ పాండే (75) కన్నుమూశారు. నాగ్‌పూర్‌కు చెందిన కృష్ణకుమార్‌ మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు జైరాం రమేశ్‌, దిగ్విజయ్‌ సింగ్‌తో కలిసి పాదయాత్ర చేసే క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు.

ఈ విషయంపై జైరాం రమేశ్‌ మాట్లాడుతూ.. కృష్ణకుమార్‌ హఠాన్మరణం కలచివేసిందని అన్నారు. ‘దిగ్విజయ్‌ సింగ్‌, నాతోపాటు కృష్ణకుమమార్‌ యాత్రలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం చేత ధరించి నడిచారు. కొద్దిదూరం వెళ్లాక పక్కనున్న వ్యక్తికి జెండా అప్పగించి.. గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పారు. ఆస్పత్రికి తరలించేలోపే ఘోరం జరిగిపోయింది’ అని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు పాండే పార్టీ కోసం పనిచేశారని జైరాం రమేశ్‌ గుర్తు చేసుకున్నారు. 
(చదవండి: గుజరాత్‌ బీజేపీ సర్కార్‌పై చిదంబరం ఫైర్‌.. తీగల వంతెన ప్రమాదంపై సీరియస్‌)

కాగా, కృష్ణకుమార్‌ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి భారత్‌ జోడో యాత్ర జరుగుతున్న ప్రాంతానికి తరలించారు. అక్కడ రాహుల్‌ గాంధీ, ఇతర నాయకులు, కార్యకర్తలు దివంగత నాయకునికి నివాళి అర్పించారు. అనంతరం తండ్రితోపాటు పాదయాత్రలో పాల్గొన్న కృష్ణకుమార్‌ కుమారుడు షీలాజ్‌ పాండేకు భౌతికకాయాన్ని అప్పగించారు.

కృష్ణకుమార్‌ అకాల మృతిపట్ల రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కుటుంబానికి కృష్ణకుమార్‌ మృతి ఎంతో బాధాకరమని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయన శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన చివరి క్షణాల్లో కూడా ఆయన జాతీయ జెండా మోయడం దేశ పట్ల ఆయన అంకితభావాన్ని తెలియజేస్తుందని అన్నారు.

యాత్రా బృందంలో 25 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ అశోక్‌ చవాన్‌ తెలిపారు. అయితే, వయసుపైబడ్డ యాత్రికులకు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ముందుగానే పరీక్షలు నిర్వహించి యాత్రలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంగళవారం సాయంత్రం జరిగే సభ.. పాండే సంస్మరణ సభగా జరుపుతామని వెల్లడించారు.
(చదవండి: ప్రజల్ని కలుస్తూ.. సమస్యలు వింటూ..)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)