వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్ర ఉద్యోగులకు బోనస్
Published on Wed, 10/20/2021 - 09:53
న్యూఢిల్లీ: 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు తాత్కాలిక బోనస్ను మంజూరుచేసింది. కేంద్ర పారా మిలటరీ బలగాలు, సాయుధ బలగాలకూ ఈ బోనస్ను మంజూరుచేసినట్లు కేంద్ర ఖర్చుల వ్యవహారాల విభాగం పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉద్యోగంలో ఉన్నవారు, 2020–21 కాలంలో మధ్యలో ఎలాంటి విరామంలేని ఆరునెలల కనిష్ట సర్వీస్కాలం ఉన్నవారు ఈ బోనస్ పొందేందుకు అర్హులు.
ఉత్పత్తి ఆధారిత బోనస్ పథకాలతో లబ్దిపొందని గ్రూప్–బి నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, గ్రూప్–సీ ఉద్యోగులకు ఈ తాత్కాలిక బోనస్ను ఇవ్వనున్నారు. ఈ బోనస్ను లెక్కించేటపుడు గరిష్టంగా రూ.7,000 వేతనాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. 30 రోజుల వేతనాన్ని బోనస్గా చెల్లిస్తారు.
చదవండి: టీకా రెండో డోస్పై దృష్టి పెట్టండి
#
Tags