వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైరల్: కర్రలతో చితకొట్టుకున్నారు
Published on Mon, 02/22/2021 - 17:33
లక్నో : రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న చిన్న వివాదం కర్రల దాడి వరకు వెళ్లింది. ఉత్తరప్రదేశ్లోని భాగ్ఫట్లో రెండు వర్గాల చెందిన పలువురు వ్యక్తులు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. కర్రలు, ఇనుప రాడ్లతో ఒకరిపై ఒకరు దాడికి దిగి నానా హంగామా సృష్టించారు. విక్షణారహితంగా కర్రలతో కొట్టుకుంటూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో యూపీ పోలీసులు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో మిగతా వారిని కూడా అరెస్ట్ చేసేందుకు గాలింపు ప్రారంభించారు. అయితే ఈ వాగ్వాదం ఎందుకు చోటుచేసుకుంది అనేది తెలియాల్సి ఉంది.
#
Tags