amp pages | Sakshi

కరోనా హెచ్చరిక: వచ్చే 4 వారాలు అత్యంత సంక్లిష్టం 

Published on Wed, 04/07/2021 - 01:30

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా పెరిగిపోతోందని, వచ్చే నాలుగు వారాలు అత్యంత సంక్లిష్టమైనని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సెకండ్‌ వేవ్‌ని కట్టడి చేయడం ప్రజల చేతుల్లోనే ఉందని హితవు పలికింది. ప్రజలందరూ కోవిడ్‌ నిబంధనలన్నీ పాటిస్తూ కరోనా కొమ్ములు వంచడానికి యుద్ధం చేయాలని పిలుపునిచ్చింది. కరోనా పరీక్షల సామర్థ్యం, ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పన, వాయువేగంగా వ్యాక్సినేషన్‌ వంటి చర్యల్ని కేంద్రం తీసుకుంటోందని, ప్రజలు కోవిడ్‌ నిబంధనలను పాటించాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతున్నాయని, మరో 4వారాలు ప్రజలందరూ జాగరూకతతో ఉండాలన్నారు.  

అందరికీ వ్యాక్సినేషన్‌ ఇప్పట్లో కుదరదు 
18 ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ఇప్పట్లో జరిగే పని కాదని కేంద్రం తేల్చి చెప్పింది. కరోనా ప్రభావం ఎవరిపై ఎక్కువ ఉంటుందో వారికే ముందుగా ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ చెప్పారు. టీకా ఎవరు అడిగితే వారికి ఇవ్వకూడదని, ఎవరికి అవసరమో వారికి ఇవ్వడమే లక్ష్యంగా ఉండాలన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్, మహారాష్ట్ర సీఎం ఠాక్రే వ్యాక్సిన్‌ వయసు నిబంధనల్ని సడలించాలని కేంద్రాన్ని కోరారు. వీరి ప్రతిపాదనలను కేంద్రం ప్రస్తుతానికి తోసిపుచ్చింది. కరోనా కట్టడికి 45 ఏళ్ల పైబడిన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని చెప్పింది.  

అత్యధిక కేసులు వస్తున్న 10 జిల్లాలు ఇవే 
కరోనా కేసులు అత్యధికంగా వస్తున్న జిల్లాల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ చేరింది. మహారాష్ట్ర నుంచి ఏడు, కర్ణాటక నుంచి ఒక జిల్లా, ఢిల్లీ టాప్‌ టెన్‌ జాబితాలో ఉన్నాయి. పుణె, ముంబై, థానే, నాగ్‌పూర్, నాసిక్, బెంగళూరు అర్బన్, ఔరంగాబాద్, అహ్మద్‌నగర్, ఢిల్లీ, దుర్గ్‌ల నుంచి అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.  

ఒకే రోజు 96,982 కేసులు  
దేశంలో వరుసగా మూడో రోజు 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 96,982 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 26 లక్షల 86 వేల49కి చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం వెల్లడించింది. మరో 446 మంది ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 1,65,547కి చేరుకుంది. లక్షా 3వేల 558 కేసులతో ఆల్‌ టైమ్‌ హైకి చేరుకున్న మర్నాడు కూడా 97 వేలకు చేరువగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.  

మహారాష్ట్రని కరోనా ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. రోజూ 47 వేలకు పైగా కేసులు నమోదు అవుతూ ఉండడంతో ఆంక్షల్ని కఠినతరం చేయాల్సి వచ్చింది. ముంబైలో ఒకే రోజు 10 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటలవరకు బీచ్‌లు, పార్కుల్లో సందర్శకులకు అనుమతిపై నిషేధం విధించారు. పుణె జిల్లాలో ఒకే రోజు 8,075 కేసులు వెలుగులోకి రావడంతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ముంబైలో ఆంక్షలు తీవ్రతరం కావడంతో వలస కార్మికులు ఉపాధి కోల్పోయి ఊరి బాట పట్టారు. రైళ్లు నిలిపివేస్తే కాలి నడకన వెళ్లాల్సి వస్తుందన్న భయంతో మూట ముల్లె సర్దుకొని స్వగ్రామాలకు తరలిపోతున్నారు. 

ఢిల్లీలో నైట్‌ కర్ఫ్యూ 
ఢిల్లీలో అనూహ్యంగా కేసులు పెరిగిపోతూ ఉండడంతో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్‌ 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (డీడీఎంఏ) నగరంలోని పరిస్థితులు సమీక్షించి ఆంక్షలు అత్యవసరం అని చెప్పడంతో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని కేజ్రివాల్‌ సర్కార్‌ నిర్ణయించింది.  
పెళ్లిళ్లు, అంత్యక్రియలు మినహా అన్ని రకాల కార్యక్రమాలపై పంజాబ్‌ నిషేధం విధించింది. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న 11 జిల్లాల్లో ఈ ఆంక్షల్ని అమలు చేసింది. పెళ్లయినా, చావైనా 20 మందికి మించి రావడానికి అనుమతిలేదు. ఇక చండీగఢ్‌లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.  
రాజస్థాన్‌లో రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి హోండెలివరీకి మాత్రమే అనుమతి ఉంది. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు బడుల్ని బంద్‌ చేశారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)