amp pages | Sakshi

దేశంలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా

Published on Mon, 12/28/2020 - 12:05

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌-19 కట్టడికై వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ మహమ్మారి రూపం మార్చుకుని మరోసారి బెంబేలెత్తిస్తోంది. దేశంలో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్ అండ్‌ ఇంటిగ్రేటివ్ బయోలజీ పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఇక కొత్తరకం వైరస్‌కు ఎన్‌440కె(N440K)గా నామకరణం చేశారు. దీనికి యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే లక్షణం ఉన్నట్లు తెలిపారు. కాగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో దీని ఉనికిని గుర్తించారు. అదే విధంగా నోయిడాలో కోవిడ్‌​ రీ ఇన్‌ఫెక్షన్‌ కేసు(కొత్తరకం)ను గుర్తించినట్లు సమాచారం. కాగా భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,021 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 279 మంది మృతి చెందారు. (చదవండి: 24 గంటల్లో 279 మంది మృతి)

దీంతో మొత్తంగా కోవిడ్‌ బాధితుల సంఖ్య కోటి రెండు లక్షలకు చేరగా.. 1,47,901 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక యూకేలో ఇప్పటికే కొత్త రకం కరోనా వైరస్‌(B.1.1.7) గుర్తించిన విషయం తెలిసిందే. శరవేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ కారణంగా మునుపటి కంటే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక దక్షిణాఫ్రికాలో సైతం మరో రూపంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్‌లో సైతం ఎన్‌440కె రకాన్ని గుర్తించారు. కాగా యూకేలో కొత్తగా 2.2 లక్షల మంది కోవిడ్‌ రోగుల్లోని 6 శాతం మందిలో కొత్త వైరస్‌ లక్షణాలు బయటపడగా.. భారత్‌లోని కోటి మందికి పైగా కరోనా పేషెంట్లలో అతిస్వల్ప సంఖ్యలో (0.05 శాతం) ఈ వైరస్‌ జన్యువులో మార్పులు గుర్తించినట్లు సమాచారం.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)