amp pages | Sakshi

‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ జల ప్రవేశం.. ప్రత్యేకతలివే..

Published on Sun, 11/21/2021 - 14:59

ముంబై: విశాఖపట్నం అంటే సముద్ర తీరంలోని ఓ నగరం గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఓ యుద్ధ నౌక కూడా విశాఖపట్నం పేరిట నిర్మితమైంది. విశాఖ నగర ప్రాధాన్యత తో పాటు చరిత్ర ఆధారంగా నేవీ ఓ యుద్ధ నౌకకు విశాఖపట్నం నామకరణం చేసింది. ఈ యుద్ధనౌక ప్రాధాన్యతలను ఇటీవల  తూర్పు నౌకాదళ ప్రధానాధికారి  వైఎస్‌ అడ్మిరల్‌ ఆజేంద్ర బహదూర్ సింగ్ తాడేపల్లిలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కూడా వివరించారు. ఆదివారం ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ‘విశాఖపట్నం యుద్ధనౌక’ను ప్రారంభించారు. ఈ యాంటీ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక రక్షణ రంగంలో కీలక భూమిక పోషించనుంది.

చదవండి: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్‌ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు

విశాఖ నగరానికి రక్షణ రంగానికి ఎంతో అనుబంధం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి విశాఖ నగరంపై శత్రుదేశాల దృష్టితో పాటు ఈ నగరం కేంద్రంగా శత్రు దేశాలు ఎదుర్కోడానికి భారత్ రక్షణ దళం కూడా ప్రత్యేక స్థావరాలు కొనసాగించింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో కైలాసగిరి.. యారాడ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేక సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అరకులో పద్మాపురం గార్డెన్స్ నుంచి సైనికులకు కూరగాయలు ప్రత్యేకంగా సరఫరా చేసేవాళ్లు. 1971లో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించడంలో విశాఖ కేంద్రంగా కొనసాగుతున్న తూర్పు నౌకాదళం ప్రధాన భూమిక పోషించింది.

దీనికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దశలో విశాఖ నగర ఖ్యాతి ప్రాధాన్యతను గుర్తిస్తూ నావికాదళం ఇటీవల విశాఖపట్నం అని పేరు పెట్టింది. 2011 జనవరి 18 నుంచి  రూపకల్పన జరిగిన ఈ యుద్ధనౌక డైరెక్టర్ ఆఫ్ నావెల్ డిజైన్. ఇండియన్ నేవీ సంయుక్తంగా యుద్ధనౌక రూపకల్పన డిజైన్ చేసింది గంటకు 30 నాటికా మైళ్ల వేగంతో ప్రయాణం చేసే యుద్ధనౌక ఏకదాటిగా నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసే సామర్థ్యం పూర్తిగా 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ విశాఖపట్నం మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక సముద్రంలో ట్రయిల్  రన్ పూర్తిచేసుకుని రక్షణ రంగంలో సేవలకు సిద్ధమైంది.

ముంబైలో రూపొందిన ఈ యుద్ధనౌకను గత నెల 31వ తేదీన తూర్పు నౌకాదళ అధికారులకు అప్పగించారు. ఈ దశలో ఈ యుద్ధ నౌక విశాఖ కేంద్రం సేవలు అందించనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన దశలో ఆ నగరం పేరిట యుద్ధనౌక రూపొందడం గొప్ప విషయంగా ప్రజలు భావిస్తున్నారు. దీన్ని లాంఛనంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు ప్రారంభించడంపై విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?