amp pages | Sakshi

ఆదేశాలు వెనక్కి; వ్యాపారులకు ఊరట!

Published on Mon, 11/23/2020 - 11:22

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పంజాబీ బస్తీ, జంటా మార్కెట్లను ఈనెలాఖరు వరకు మూసివేయాలన్న ఆదేశాలను ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో చిరు వ్యాపారులకు భారీ ఊరట లభించింది. కాగా ఢిల్లీలో కరోనా వైరస్‌ థర్డ్‌వేవ్‌ మొదలైన నేపథ్యంలో కోవిడ్‌-19 నిబంధనలు కఠినతరం చేస్తూ కేజ్రీవాల్‌ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మాస్కు ధరించకపోతే 2 వేల రూపాయల జరిమానా, అదే విధంగా పెళ్లి తదితర శుభాకార్యాలకు 50 మంది అతిథులకు మాత్రమే అనుమతించింది.

ఇక మార్కెట్లు తెరిచేందుకు పర్మిషన్‌ ఇచ్చినా, పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ క్రమంలో మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి ఏరియాలో  సాయంకాలపు మార్కెట్లు పంజాబీ బస్తీ, జంటా సముదాయంపై కొరడా ఝులిపించింది. నవంబరు 30 వరకు ఈ మార్కెట్లను మూసివేయాల్సిందిగా ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: కరోనా విజృంభణ; నైట్‌ కర్ఫ్యూ, సెక్షన్‌ 144 అమలు!)

ఈ క్రమంలో వెస్ట్‌ ఢిల్లీ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతాన్ని సందర్శించి షాపులు మూసివేసేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే సుమారు 200 మంది వ్యాపారులు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తారని, ఈ మార్కెట్లను మూసివేయడం వల్ల తామంతా భారీగా నష్టపోవాల్సి ఉంటుందని నంగ్లోయి మార్కెట్‌, షుకర్‌ బజార్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సుభాష్‌ బిందాల్‌ సహా పలువురు మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

ఈ నేపథ్యంలో మరుసటి రోజే నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. కరోనా విజృంభన నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలోనే ఈ మార్కెట్లను మూసివేయాల్సిందిగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)