amp pages | Sakshi

చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్‌ వేసినట్లు కుటుంబ సభ్యులకు మెసేజ్‌

Published on Sat, 07/17/2021 - 16:14

అహ్మ‌దాబాద్: ఇటీవల ఓ వ్యక్తి వ్యాక్సిన్‌ వేసుకోకుండానే మొదటి డోసు తీసుకున్నట్లు మెసేజ్‌ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. కొవిన్‌ పోర్టల్‌లో ఆ లోటుపాట్ల‌ను సరిదిద్దడం పక్కన పెడితే ఇలాంటి ఘటనలే  మళ్లీ జరుగుతునే ఉన్నాయి. తాజాగా రెండు నెల‌ల కింద‌ట మ‌ర‌ణించిన ఓ వ్య‌క్తికి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఇచ్చిన‌ట్టు వాక్సిన్‌ పోర్టల్‌ నుంచి మెసేజ్‌ రావడంతో ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హర్జీ లక్ష్మణ్‌ పర్మార్‌ కరోనాతో ఏప్రిల్ 23న బనస్కాంతలో తరాడ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, అతని కుమారుడు వెర్షిభాయ్‌ పర్మార్‌ అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే, ఆశ్చర్యకరంగా, జూలై 14 న వర్షిభాయ్‌కు కోవిన్ వ్యాక్సిన్ పోర్టల్ నుంచి ఒక మెసేజ్‌ వచ్చింది. అందులో తన తండ్రికి కరోనా వ్యాక్సిన్ రెండో డోసు టీకా వేసినట్లు, అందుకు ధన్యవాదాలు తెలుపుతూ అందులో ఉంది. దీంతో తండ్రి చనిపోయి బాధలో ఉన్న వెర్షిభాయ్‌కు ఇలాంటి మెసేజ్‌లు త‌మ గాయాల‌పై ఉప్పు వేసిన‌ట్టు ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొవిన్ వ్యాక్సిన్ పోర్ట‌ల్ నుంచి గ‌తంలోనూ ఇలానే వ్యాక్సినేష‌న్‌కు సంబంధించి ప‌లు త‌ప్పుడు మెసేజ్‌లు వ‌చ్చాయి. 

వెర్షిభాయ్ మాట్లాడుతూ.. మా నాన్న ఎప్పుడూ టీకా కోసం వెళ్ళలేదు. అసలు మొదటి డోసు కూడా తీసుకోలేదు.  సమయానికి  ఆక్సిజన్, బెడ్‌ దొరికి ఉండుంటే తన తండ్రి ఇంకా బతికే ఉండేవాడని వాపోయాడు. స‌కాలంలో చికిత్స అందించేందుకు అవ‌స‌ర‌మైన బెడ్ ల‌భించ‌క ఓ వ్య‌క్తి మ‌ర‌ణిస్తే విచిత్రంగా ఆయ‌న‌కు కరోనా వ్యాక్సిన్ వేసిన‌ట్టు చూపుతున్నార‌ని, సంబంధిత అధికారాలు ఇకనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అతను కోరాడు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)