నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
Published on Tue, 10/06/2020 - 16:01
చండీగఢ్ : కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను సైతం వదలడం లేదు. ఇప్పటికే పలువురు మఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా హరియాణా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మంగళవారం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందే కోవిడ్ నిర్ధారణ రిపోర్ట్స్ వచ్చాయి. దాంట్లో నాకు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ స్వీయ నిర్భంధంలో ఉండండి. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లండి’ అని దుష్యంత్ ట్వీట్ చేశారు.
सभी साथियों के लिए सूचना -
— Dushyant Chautala (@Dchautala) October 6, 2020
मेरी Covid-19 की रिपोर्ट positive आई है। मेरा स्वास्थ्य ठीक है। आग्रह है कि बीते कुछ दिनों में मेरे संपर्क में आए लोग अपना ध्यान रखें और डॉक्टर सलाह दें तो टेस्ट करवाएं। pic.twitter.com/whuguUR3bp
Tags