amp pages | Sakshi

Sushant Singh Death: ఒక్కసారి కాల్‌ చేసి ఉంటే.. కంటతడి పెట్టుకున్న స్మృతి ఇరానీ

Published on Tue, 03/28/2023 - 11:46

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి దాదాపు మూడేళ్లు కావోస్తుంది. 2020 జూన్‌ 14l ముంబై బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీలానే ఉంది. నటుడి మృతిని సెలబ్రిటీలు, అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. నేటికి ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉన్నారు. సుశాంత్‌ అకాల మరణంపై తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. 

స్మతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తరువాత టీవీ సీరియల్స్‌, పలు సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సుశాంత్ సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ముంబైలో టీవీ షోలలో పనిచేయడంతో అతనితో ఆమెకు మంచి బంధం ఉంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కేంద్ర మంత్రి..సుశాంత్  మరణించినప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

‘సుశాంత్ సింగ్ మరణం గురించి తెలిసినప్పుడు నేను వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాను. ది స్లో కాన్వర్సేషన్‌లో నీలేష్ మిశ్రాతో  మాట్లాడుతున్నాను. సుశాంత్ మరణ వార్త తట్టుకోలేక పోయాను ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. వెంటనే ఆ కాన్ఫరెన్స్ ఆపేశాను. మరణించే ముందు సుశాంత్‌ నాకు ఎందుకుఫోన్‌ చేయలేదని బాధపడ్డాను. ఒకవేళ చేసి ఉంటే.. మిమ్మల్ని మీరు బలవంతంగా చంపుకోవడం ఆపండి అని చెప్పాలి అనుకున్నాను’ అని భావోద్వేగానికి లోనయ్యారు. 

తరువాత సుశాంత్‌ సహానటుడు, స్నేహితుడు అమిత్ సాద్‌కి కాల్ చేసి మాట్లాడినట్లు స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. సుశాంత్ ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆ సమయంలో అమిత్‌ కూడా షాక్‌లో ఉన్నాడని, సుశాంత​ తనకు జీవించడం ఇష్టం లేదని తనతో చెప్పినట్లు అమిత్‌ చెప్పాడని పేర్కొన్నారు.  కనీసం ఒక్కసారయినా తనకు ఫోన్ చేసే సుశాంత్‌.. ఆత్మహత్య చేసుకునేముందు ఎందుకు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)