amp pages | Sakshi

2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం

Published on Mon, 03/15/2021 - 15:06

ప్రస్తుత చట్టాల ప్రకారం ఆదాయపు పన్ను రిటర్నులను(ఐటిఆర్) దాఖలు చేయడానికి భారత ప్రభుత్వం పాన్(శాశ్వత ఖాతా సంఖ్య)ను ఆధార్‌తో లింకు చేయడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ లింక్ చేయకపోతే రూ.10,000 జరిమానాను విధించనున్నట్లు తెలిపింది. ఆధార్‌ లేని పాన్‌ కార్డులను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 139ఏ(2)ప్రకారం రద్దు చేస్తామని సీబీడీటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ ‌తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డును రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సైతం హెచ్చరించింది. 

2021 మార్చి 31లోపు లింక్ చేయాలని కేంద్రం ప్రకటించింది. అలా చేయడంలో విఫలమైతే మీరు బ్యాంక్ ఖాతా తెరవడం లేదా పెన్షన్, స్కాలర్‌షిప్, ఎల్‌పీజీ సబ్సిడీ వంటి ప్రభుత్వాల ఆర్థిక ప్రయోజనాలను పొందలేరు. అయితే రెండు కార్డుల్లో మీ వివరాలు ముఖ్యంగా పేరు, పుట్టిన తేదీ వివరాలు వేరువేరుగా ఉంటే కార్డుల లింకింగ్ సాధ్యపడకపోవచ్చు. ఇంకా ఆధార్-పాన్ లింకు కోసం 15 రోజుల సమయం కాబట్టి రెండు నిమిషాల్లో క్రింద చెప్పిన విధంగా లింకు చేయవచ్చు. 

ఆధార్-పాన్ లింక్ విధానం:

  • ఐటి విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించండి.
  • 'క్విక్ లింకులు' విభాగం కింద వెబ్‌పేజీకి ఎడమ వైపున ఉన్న 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి.
  • ఆధార్ కార్డు ప్రకారం ఆధార్ నంబర్, మీ పేరు, పాన్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేయండి.
  • పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే మీ ఆధార్ కార్డులో పేర్కొన్నట్లయితే కింద ఉన్న చెక్ బాక్స్ పై టిక్ చేయండి.
  • 'నా ఆధార్ వివరాలను యుఐడిఏఐతో ధృవీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను' అని ఉన్న బాక్స్ పై క్లిక్ చేయండి. 
  • మీ స్క్రీన్‌పై క్యాప్చా కోడ్‌ను ఎంటర్ స్క్రీన్ పై క్లిక్ చేయండి 
  • ఏదైనా దృశ్య లోపం ఉంటే వినియోగదారులు క్యాప్చా కోడ్‌కు బదులుగా వన్-టైమ్ పాస్‌వర్డ్ కోసం అభ్యర్థించవచ్చు. 
  • ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • 'లింక్ ఆధార్' బటన్ పై క్లిక్ చేస్తే ఇప్పుడు మీ ఆధార్, పాన్ లింక్ అవుతాయి.

చదవండి:

కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్! 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)