amp pages | Sakshi

1,445 కేసుల్లో నలుగురికే శిక్ష

Published on Fri, 02/26/2021 - 10:00

సాక్షి, బెంగళూరు: ఏసీబీ అలసత్వం వహిస్తోందని విమర్శలను మూటగట్టుకుంటోంది. అవినీతిపరులకు వణుకు పుట్టించి ప్రజలకు భరోసానివ్వాల్సిన ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కోరల్లేని పాముగా మారుతోంది. గడిచిన ఐదేళ్లలో 1,445 లంచం, అక్రమ సంపాదన కేసులు నమోదు చేసి, కేవలం నలుగురిని మాత్రమే దోషులుగా తేల్చగలిగింది. దీంతో ఏసీబీ పనితీరు, వేగంపై ప్రస్తుతం ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆదాయానికి మించి అక్రమాస్తులను సంపాదించడంపై 2016 నుంచి  మొత్తం 186 మంది ప్రభుత్వ సిబ్బందిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. అలాగే లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలపై మరో 957 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కేసులు నమోదు చేసింది. ఇందులో కేవలం నాలుగు కేసుల్లోనే ఏసీబీ అభియోగాలను రుజువు చేసి దోషులకు శిక్ష పడేలా చేయగలిగినట్లు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాటం సాగిస్తున్న కర్ణాటక రాష్ట్ర సమితి వెల్లడించింది.  

కావాలనే కేసుల మూసివేత  
కొంత మంది సీనియర్‌ రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లపై వచ్చిన ఫిర్యాదులను, సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ ఏసీబీ కావాలనే మూసేసినట్లు సమితి ఆరోపించింది. ఏసీబీ స్వయంగా దాడులు చేసి ప్రత్యక్షంగా లంచాలు తీసుకుంటుండగా పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగుల కేసుల్లోనూ నిందితులకు శిక్ష పడేలా చేయడంలో ఏసీబీ విఫలం అయిందని పేర్కొంది.  

బాగా పనిచేస్తున్నాం:ఏసీబీ  
ఈ వాదనను ఏసీబీ తోసిపుచ్చుతోంది. ఇప్పటివరకు 1,568 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 1,541 మంది ప్రభుత్వ అదికారులను ఆయా కేసుల్లో అరెస్టు చేసినట్లు, వీరిలో 1,199 మంది సస్పెన్షన్‌కు గురయ్యారని వెల్లడించారు. 940 మంది అధికారులపై ఏసీబీ దర్యాప్తునకు సూచనలు చేసినట్లు తెలిపారు. 815 ఎఫ్‌ఐఆర్‌లల్లో చార్జ్‌ïÙట్‌ కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ కేసులన్నీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రత్యేక కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయని తెలిపారు. 

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌