amp pages | Sakshi

దేశ ప్రజలే మాకు ముఖ్యం: సీరం

Published on Tue, 05/18/2021 - 21:15

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ణంగా పెట్టి విదేశాలకు టీకాలు ఎగుమ‌తి చేయ‌లేదని కోవిషీల్డ్ త‌యారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అద‌ర్ పూనావాలా తెలిపారు. కరోనా కట్టడి కోసం దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించినప్పటికి టీకాల కొరత వల్ల అది అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. 45 ఏళ్ల పైబడిన వారికి రెండో డోస్‌ టీకా ఇవ్వడం పూర్తవ్వలేదు. ఇక పలు రాష్ట్రాల్లో మూడో దశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో భార‌త్‌లో వ్యాక్సినేష‌న్‌పై సీరం సంస్థ మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. దేశ ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ణంగా పెట్టి తాము విదేశాలకు టీకాలు ఎగుమ‌తి చేయ‌లేదని తెలిపింది. దేశంలో వ్యాక్సినేష‌న్‌కు స‌హ‌క‌రించేందుకు క‌ట్టుబ‌డి ఉన్నట్లు లేఖలో తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు 20 కోట్ల టీకా డోసులు స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు వెల్ల‌డించింది. భార‌త్ వంటి దేశంలో 2,3 నెల‌ల్లో వ్యాక్సినేష‌న్ చేయ‌లేమ‌న్నది. భార‌త్‌లో వ్యాక్సినేష‌న్‌లో అనేక స‌వాళ్లు ఉన్నట్లు తెలిపింది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా గ‌ల దేశాల్లో భార‌త్ ఒక‌టి అని పేర్కొంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్‌కు 2 నుంచి 3 ఏళ్లు ప‌డుతుంద‌ని సీఎం తెలిపింది. అమెరికా కంపెనీల కంటే త‌మ‌కు 2 నెల‌లు ఆల‌స్యంగా అనుమ‌తులు వ‌చ్చాయ‌న్నది. ఉత్ప‌త్తిప‌రంగా ప్ర‌పంచంలోనే త‌మ‌ది మూడో స్థానమ‌ని.. ఈ ఏడాది చివ‌ర‌కు మాత్ర‌మే విదేశాల‌కు టీకాలు స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని సీరం తెలిపింది. క‌రోనాపై యుద్ధానికి అంతా క‌లిసిక‌ట్టుగా పోరాడాలని సీరం పిలుపునిచ్చింది.

చదవండి: యూకేకు 50 లక్షల డోసుల ఎగుమతికి ‘నో’ 

Videos

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌