amp pages | Sakshi

'అమృత్‌ మహోత్సవ్‌'కు ప్రధాని మోదీ శ్రీకారం

Published on Fri, 03/12/2021 - 11:53

గుజరాత్‌: 'అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలకు గుర్తుగా గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి 'అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమాన్ని ప్రధాని.. శుక్రవారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో 75 వారాల పాటు 'అమృత్‌ మహోత్సవ్‌' నిర్వహించనున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట స్వాతంత్ర్య సంబరాలు జరపనున్నారు.

నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్‌:
ఈ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగురవేయగా, వరంగల్‌లో గవర్నర్ తమిళిసై జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, గాంధీ ఉద్యమం తర్వాత అద్భుత ఘట్టాలు ఆవిష్కరించబడ్డాయన్నారు. అహింసాయుతమైన పద్ధతిలో గాంధీ పయనించారని తెలిపారు. అహింసా పద్ధతిలోనే స్వాతంత్ర్యం సాధించి, మహాత్మా గాంధీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

‘‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌కు కూడా గాంధీనే ఆదర్శం. గాంధీ సిద్ధాంతాలు నేటి యువతకు ఆదర్శం. 384 కి.మీ. 24 రోజులపాటు గాంధీతోపాటు సత్యాగ్రహులు పాదయాత్ర చేశారు.గాంధీ వెంట సుమారు 70వేల మంది పాల్గొన్నారు. దండి యాత్ర ఒక ప్రవాహంలా నడిచింది. దండి యాత్ర స్ఫూర్తితో అమృత్‌ మహోత్సవ్ కొనసాగుతుంది. దండి యాత్రలో హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజిని నాయుడు కూడా పాల్గొన్నారు. ఎందరో మహానీయులు ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా గాంధీ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నాం. అదే స్ఫూర్తితో తెలంగాణను సాధించుకున్నామని’’ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రమణా చారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రూ.25 కోట్లు కేటాయిస్తున్నామని సీఎం ప్రకటించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)