amp pages | Sakshi

దేశంలోనే తొలి స్థానంలో ఇండోర్‌

Published on Thu, 08/20/2020 - 13:10

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌ ‘స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్-2020’ అవార్డులు ప్ర‌క‌టించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఇలా వ‌రుస‌గా నాలుగో సారి ఇండోర్‌ తొలి స్థానాన్నే కైవసం చేసుకోవ‌డం విశేషం. రెండో స్థానంలో సూర‌త్‌(గుజరాత్), మూడో స్థానంలో ముంబై(మ‌హారాష్ట్ర‌) నిలిచాయి. మొద‌టి ప‌ది స్థానాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి న‌గ‌రాలు కూడా చోటు ద‌క్కించుకున్నాయి. గురువారం 'స్వ‌చ్ఛ మ‌హోత్స‌వ్' కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా జ‌లంద‌ర్ కాంత్ దేశంలోనే అత్యంత ప‌రిశుభ్ర‌త క‌ల కంటోన్మెంట్‌గా ప్ర‌క‌టించారు. ప‌రిశుభ్ర‌త గ‌ల ప‌ట్ట‌ణంగా వార‌ణాసి చోటు ద‌క్కించుకుంది. 4,242 న‌గ‌రాలు, 62 కంటోన్మెంట్ బోర్డు, 92 గంగా స‌మీపంలోని‌ ప‌ట్ట‌ణాల నుంచి మొత్తం 1.87 కోట్ల మంది ఇందుకు సంబంధించిన‌ స‌ర్వేలో పాల్గొన్నారు. ఈ స‌ర్వే 28 రోజుల పాటు చేప‌ట్ట‌గా అనంత‌రం ర్యాంకులు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి.. ఇండోర్ మ‌ళ్లీ త‌న ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డంపై ఆ ప్రాంత ఎంపీ శివ‌రాజ్ చౌహాన్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ నగ‌ర శుభ్ర‌త ప‌ట్ల చూపిన అంకిత భావాన్ని కొనియాడారు. (రూల్స్‌ బ్రేక్‌: నడిరోడ్డుపై పెళ్లికొడుక్కి...)

ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులు
దేశంలో పరిశుభ్ర రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఆరో స్థానాన్ని ద‌క్కించుకోగా తెలంగాణ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది. దేశంలోనే ప‌రిశుభ్ర‌త గ‌ల న‌గ‌రంగా విజ‌య‌వాడ నాలుగో స్థానం ద‌క్కించుకుంది. తిరుప‌తి ఆరో ర్యాంకు, విశాఖ‌ప‌ట్నం తొమ్మిదో ర్యాంకు సాధించింది. బెస్ట్ మెగా సిటీ కేట‌గిరీలో రాజ‌మండ్రి చోటు సంపాదించుకుంది. దీనితో పాటు ఒంగోలు, కాకినాడ, కడప, తెనాలి, చిత్తూరు, హిందూపురం, తాడిపత్రి కూడా స్థానం ద‌క్కించుకున్నాయి

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)