amp pages | Sakshi

పాడె మోసేందుకు ఒక్క‌డు రాలేదు, తిన‌డానికి 150 మంది వ‌చ్చారు

Published on Sun, 05/30/2021 - 13:30

పాట్నా : సాటి మనిషికి కష్టమొస్తే.. అండగా నిలిచి మానవత్వం చూపాల్సిన వాళ్లే రాబందుల కన్నా హీనంగా వ్యవహరించారు. రాబందులన్నా.. కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ రాబందులు బతికున్న వాళ్లను పీక్కుతింటున్నారు. అనాథలైన పిల్లలకు తలో చేయ్యేసి మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన తరుణంలో వీరు తలో చేయ్యేసి వారి సొమ్మును కాజేసి వాటాలు పంచుకున్నారు. 

బిహార్ అరియా జిల్లాలో బిష్ణుపుర గ్రామపంచాయితీకి చెందిన ముగ్గురు చిన్నారులు సోని(18) నితీష్ (14 ), చాందిని (12)లు నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో త‌ల్లితండ్రుల్ని కోల్పోయి అనాథ‌ల‌య్యారు. అనారోగ్యంతో తండ్రి బిరేంద్ర సింగ్, క‌రోనాతో త‌ల్లి ప్రియాంక దేవి మ‌ర‌ణిస్తే అంత్య‌క్రియ‌ల్ని నిర్వ‌హించేందుకు 18ఏళ్ల కుమార్తె గ్రామ‌స్తుల సాయం కోరింది. ఒక్క‌రంటే ఒక్క‌రు ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ బాలిక త‌ల్లి మృత‌దేహాన్ని తన ఇంటి స‌రిహ‌ద్దుల్లోనే అంత్య‌క్రియలు నిర్వ‌హించింది. కానీ త‌ల్లిదండ్రుల‌ ఆత్మ‌శాంతి కోసం నిర్వ‌హించిన ద‌శ‌దిన క‌ర్మకు  భోజనం చేసేందుకు 150 మంది గ్రామ‌స్తులు వ‌చ్చారు. భోజ‌నం చేసిన అనంత‌రం త‌ల్లిదండ్రుల‌కు ట్రీట్మెంట్ కు తాము ఇచ్చిన డ‌బ్బుల్ని తిరిగి ఇవ్వాల‌ని ఒత్తిడి చేశారు. అందిన‌కాడికి అభంశుభం తెలియ‌ని అమాయ‌కుల‌ నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసి వాటాలు పంచుకోవ‌డం ప‌లువురిని కంట‌త‌డిపెట్టిస్తోంది.  

ఈ సంద‌ర్భంగా పెద్ద‌కుమార్తె సోని మాట్లాడుతూ.. ‘నా తండ్రి అనారోగ్యంతో మ‌ర‌ణించారు. త‌ల్లి క‌రోనాతో మ‌ర‌ణించింది. అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు గ్రామ‌స్తుల్ని సాయం కోరితే ఒక్క‌రు కూడా ముందుకు రాలేదు. కానీ ద‌శ‌దిన కర్మ‌కు 150 మంది గ్రామ‌స్తులు వ‌చ్చారు. ఇంత‌మంది వ‌స్తార‌ని ఊహించ‌లేదు. వ‌చ్చిన వాళ్లు తండ్రి ట్రీట్మెంట్‌కు డ‌బ్బులు ఇచ్చామ‌ని, ఆ డ‌బ్బులు తిరిగి చెల్లించాల‌ని మాపై ఒత్తిడి తెచ్చారంటూ’ ఆ బాలిక క‌న్నీటి ప‌ర్యంత‌ర‌మైంది. 


చ‌ద‌వండి:  పేరుకే గుమ‌స్తా, ఇంట్లో ఎటు చూసినా బంగార‌మే

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)