amp pages | Sakshi

బాబూ.. ఇంతకంటే మేలైన విధానాలు ఉంటే చెప్పండి

Published on Wed, 07/27/2022 - 04:30

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకోసమే పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టిందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ప్రభుత్వ విధానంపై ఉపాధ్యాయ సంఘాల తీరు సహేతుకంగా లేదని మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలను బెదిరిస్తామంటే పనులు కావని, ప్రభుత్వం ఉన్నది ప్రజలకు మేలు చేసేందుకేనని, అందుకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ ఉండాలని తాను చెప్పానని, ఉపాధ్యాయులు కూడా 8 గంటలు పనిచేయాలని తెలిపారు.

ఉద్యోగ రీత్యా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ఉద్యమాల పేరుతో ప్రజల్లో చులకన కారాదని ఉపాధ్యాయ సంఘాలకు హితవు పలికారు. నూతన విద్యా విధానం ప్రకారం మూడో తరగతి నుంచి ప్రత్యేకంగా తరగతి ఉపాధ్యాయుడిని నియమిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు అంతా ప్రభుత్వ విధానాలను అభినందిస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒకే ఉపాధ్యాయుడు ఉండాలన్నట్లుగా మాట్లాడటం సరికాదన్నారు.

ఇంతకన్నా మేలైన విధానాలు ఉంటే చంద్రబాబు చెప్పాలని, విద్యార్థులకు మేలు జరిగే విధానాలు ఏవైనా తాము ఏ భేషజాలు లేకుండా స్వీకరిస్తామని అన్నారు. జిల్లాల్లోని పాఠశాలలపై స్థానిక ఎమ్మెల్యేల నుంచి వినతులు తీసుకున్నామని, 5,800 స్కూళ్లను మ్యాపింగ్‌ చేస్తే సుమారు 400 స్కూళ్ల నుంచి వినతులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఆయా జిల్లా జాయింట్‌ కలెక్టర్లతో కమిటీని వేశామని, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సానుభూతి కాదు.. సాయం కావాలి
ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో స్వదేశానికి వచ్చేసిన మన వైద్య విద్యార్థులు ఇక్కడ చదువు కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. మంగళవారం ఈఏపీసెట్‌–2022 ఫలితాలు విడుదల చేసిన సందర్భంలో విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ సమాధానమిచ్చారు. విధిలేని పరిస్థితుల్లో చదువులు ఆపేసి భారత్‌కు తిరిగొచ్చిన మన విద్యార్థులపై ఇప్పుడు చూపాల్సింది సానుభూతి కాదని.. వారికి సాయం కావాలని పేర్కొన్నారు.   

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)