amp pages | Sakshi

దృష్టి మళ్లించేందుకే దుష్ప్రచారం

Published on Mon, 09/12/2022 - 04:19

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌ ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించేలా వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాలను ప్రవేశపెట్టారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చడమే లక్ష్యంగా చంద్రబాబు, ఎల్లో మీడియాతో కూడిన దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 99 శాతం హామీలను అమలు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కు దక్కుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పూర్తి న్యాయం చేయాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు. కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద చంద్రబాబు చెప్పిన దానికంటే రెండింతలు అధికంగా ఇస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో వివాహ కానుక కింద 18 వేల మందికి రూ.69 కోట్లను ఎగ్గొట్టిన చంద్రబాబు ఇప్పుడు వేదాలు వల్లిస్తుండటం సిగ్గుచేటని బొత్స ధ్వజమెత్తారు.

అక్టోబర్‌ 1 నుంచి కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేయనుండటంతో ప్రజల దృష్టి మరల్చడానికి ‘ఈనాడు’లో ఇసుకపై అసత్య కథనాలను ప్రచురించారని మండిపడ్డారు. ప్రస్తుతం ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తోందని, టీడీపీ హయాంలో అదంతా ఆ పార్టీ నేతలు దోచుకుంటే రామోజీరావుకు ఇంపుగా అనిపించిందా? అని ప్రశ్నించారు. ఇసుక సరఫరా కాంట్రాక్టర్‌ నిబంధనల ప్రకారం పని చేయాల్సిందేనని, టీడీపీ హయాంలో మాదిరిగా వారి సామాజిక వర్గంవారో, వారి అనుయాయులే తింటామంటే కుదరదని తేల్చిచెప్పారు.

మూడు రాజధానులకు కట్టుబడ్డాం
అమరావతి నుంచి అరసవల్లికి పాదయాత్ర ఉద్దేశం ఏమిటని మంత్రి బొత్స ప్రశ్నించారు. అమరావతిలాగే విశాఖపట్నం అభివృద్ధి చెందితే చంద్రబాబుకు ఇష్టం లేదా? అని నిలదీశారు. సాధారణ భవనం కట్టినా వందల అడుగులు లోతులో పునాదులు వేయాల్సిన ప్రాంతంలో రాజధానిని చంద్రబాబు ఎంపిక చేశారని చెప్పారు. అక్కడ రాజధాని నిర్మించాలంటే రూ.లక్షల కోట్లు ఖర్చవుతుందని, అంత వ్యయాన్ని 29 గ్రామాల అభివృద్ధికి వెచ్చించడం భావ్యమా? అని ప్రశ్నించారు.

అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పక్కదారి పట్టించలేదని స్పష్టం చేశారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, మూడు రాజధానులకు కట్టుబడ్డామని తేల్చిచెప్పారు. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాల వారు ఉండాలనే సీఆర్‌డీఏ చట్టంలో మార్పులు చేశామని పునరుద్ఘాటించారు. చంద్రబాబు ఆయన సామాజిక వర్గం బాగుండాలని కోరుకుంటారే కానీ రాష్ట్రాభివృద్ధిని కాంక్షించరని విమర్శించారు.

రాజధాని పేరుతో రూ.ఆరువేల కోట్లు అప్పులు తెచ్చిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా వ్యతిరేకించడమంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవడమేనని, దీన్ని ఆ ప్రాంత ప్రజలు చూస్తు ఊరుకోరని  అన్నారు.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)