amp pages | Sakshi

నాయకుడు అనేవాడు డ్రామాలు చేయకూడదు: సీఎం జగన్‌

Published on Fri, 11/26/2021 - 14:57

సాక్షి, అమరావతి: చిత్తూరు పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘నాయకుడు అనేవాడికి.. ప్రజలకు జరగాల్సిన మంచి సరైన పద్దతిలో, అందరికి అందుతుందా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం.. అంతేతప్ప.. బాధితుల దగ్గరకు వెళ్లి డ్రామాలు చేయడం కాదు. లీడర్‌ అంటే అక్కడకు వెళ్లి పనులు సరైన పద్దతిలో జరుగుతున్నాయా లేదా పరిశీలించాలి. కార్యక్రమాలు సరైన పద్దతిలో జరిగేలా చూడాలి’’ అని సీఎం జగన్‌ తెలిపారు. 
(చదవండి: ఒక్కసారిగా మంత్రిని చూసి ఆశ్చర్యం.. మీరేంటి ఇక్కడికి వచ్చారు..)

‘‘ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అధికారులు నాకు స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పారు. ముఖ్యమంత్రి వస్తున్నారని.. అందుకోసం ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం అంత బిజీ అవుతారు. వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేసి సీఎం పర్యటన మీద ఫోకస్‌ పెడతారు. ఫలితంగా సహాయక చర్యలు, కార్యక్రమాలు ఆగిపోయి.. సీఎం చుట్టూ జిల్లా యంత్రాంగం, మీడియా, హడావుడి తప్ప.. పనులు జరగవు అని సీనియర్‌ అధికారులు నాకు తెలిపారు. వారి మాటలు వాస్తవం అనిపించాయి. అందుకే నాకు వెళ్లాలని ఉన్నా.. కూడా వెళ్లలేదు. నా పర్యటన నాలుగు రోజులు ఆలస్యం అయినా పర్వాలేదు అని ఆగాను’’ అన్నారు సీఎం జగన్‌. 
(చదవండి: ట‘మోత’ తగ్గేలా.. సీఎం జగన్‌ ఆదేశాలతో రంగంలోకి మార్కెటింగ్‌ శాఖ)

‘‘చిత్తూరు జిల్లాలో పర్యటించడానికి వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. నన్ను ఉద్దేశించి.. ‘‘గాల్లోనే వచ్చి.. గాల్లోనే కలిసి పోతారు.. ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగు అవుతారు.. నన్ను వ్యతిరేకించిన వైఎస్సార్‌ కూడా కాలగర్భంలో కలిసిపోయారు’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో నాయకుడు అనేవాడు జనాల దగ్గరకు వెళ్లి.. వారితో మాట్లాడి.. ధైర్యం చెప్పి.. మీకు నేనున్నాను అనే నమ్మకం కలిగించాలి తప్ప. ఇలా వ్యక్తిగత విద్వేషాన్ని వెళ్లగక్కకూడదు. ఈ విషయంలో చంద్రబాబు సంస్కారానికి నా నమస్కరం’’ అంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 

చదవండి: అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగింది.. ఎలా రక్షించారు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)